IND vs AFG: రెండు మార్పులతో రోహిత్ సేన.. రెండో టీ20లో టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?

India Playing 11 vs Afghanistan 2nd T20I: గాయం సమస్య కారణంగా యశస్వి జైస్వాల్ తొలి టీ20 మ్యాచ్‌లో ఆడలేదు. ఈ కారణంగా, సారథి రోహిత్ శర్మతో కలిసి శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జైస్వాల్ రెండో టీ20 మ్యాచ్‌లో ఆడే విషయంపై ఎలాంటి సమాచారం లేదు. అటువంటి పరిస్థితిలో, గిల్ రెండవ టీ20లో రోహిత్‌తో ఓపెనింగ్ చేయవచ్చు. కోహ్లీ మూడో స్థానంలో ఆడితే, శివమ్ దూబే నాలుగో స్థానంలో ఆడడం ఖాయం. ఎందుకంటే తొలి టీ20 మ్యాచ్‌లో 40 బంతుల్లో 60 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

IND vs AFG: రెండు మార్పులతో రోహిత్ సేన.. రెండో టీ20లో టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
Ind Vs Afg 2nd T20i Kohli

Updated on: Jan 14, 2024 | 10:42 AM

India Playing 11 vs Afghanistan 2nd T20I: ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం(Holkar Stadium in Indore)లో నేడు అంటే, జనవరి 14న భారత్, ఆఫ్ఘనిస్థాన్ (India vs Afghanistan) మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. 2024 టీ20 ప్రపంచకప్‌నకు ముందు టీమిండియాకు ఇదే చివరి టీ20 ద్వైపాక్షిక సిరీస్. ఈ కారణంగా, బీసీసీఐ పాలకమండలి సరైన జట్టు కూర్పును కనుగొనాలనుకుంటోంది. దీంతో రెండో టీ20లో మార్పు ఖాయమని తెలుస్తోంది. దీనికి తోడు తొలి టీ20 మ్యాచ్‌కు దూరమైన విరాట్ కోహ్లీ(Virat Kohli) 2వ మ్యాచ్ ఆడేందుకు జట్టులోకి వచ్చాడు. మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడిన శివమ్ దూబే (Shivam Dube)కూడా ఈ విషయాన్ని ధృవీకరించాడు.

సాధారణంగా జట్టు కెప్టెన్ లేదా కోచ్ మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. అయితే, నిన్న భారత ఆల్ రౌండర్ శివమ్ దూబే మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ, అతను రెండో టీ20లో బరిలోకి దిగే ప్లేయింగ్ 11పై కీలక అప్డేట్ ఇచ్చాడు. దీని గురించి మాట్లాడిన దూబే, తదుపరి మ్యాచ్ నుంచి ఒక ఆటగాడిని జట్టు నుంచి తొలగిస్తామని స్పష్టం చేశాడు. కోహ్లి పునరాగమనంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చాడు. దీంతో 2వ టీ20 మ్యాచ్‌లో ఆడనున్నాడని కూడా స్పష్టం చేశాడు.

దూబే ఏం చెప్పాడంటే?

కోహ్లి ఆడితే జట్టు నుంచి ఏ ఆటగాడు తప్పుకుంటారనే ప్రశ్నకు దూబే సమాధానమిస్తూ.. ‘ఎవరిని డ్రాప్ చేస్తారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే, ఎవరైనా డ్రాప్ కావడం ఖాయమని’ అన్నాడు. తొలి టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ, శుభ్‌మన్ గిల్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అటువంటి పరిస్థితిలో, ఈ ఇద్దరు ఆటగాళ్లలో ఎవరైనా బెంచ్‌పై వేచి ఉండగలరు. అయితే కోహ్లి రాకతో తిలక్ వర్మను జట్టు నుంచి తప్పించే అవకాశం పెరిగింది. దీంతో పాటు రవి విష్ణోయ్‌ని కూడా జట్టు నుంచి తప్పించే అవకాశం ఉందని, బదులుగా కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవచ్చని తెలుస్తోంది.

బ్యాటింగ్ విభాగం ఎలా ఉండనుందంటే..

గాయం సమస్య కారణంగా యశస్వి జైస్వాల్ తొలి టీ20 మ్యాచ్‌లో ఆడలేదు. ఈ కారణంగా, సారథి రోహిత్ శర్మతో కలిసి శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జైస్వాల్ రెండో టీ20 మ్యాచ్‌లో ఆడే విషయంపై ఎలాంటి సమాచారం లేదు. అటువంటి పరిస్థితిలో, గిల్ రెండవ టీ20లో రోహిత్‌తో ఓపెనింగ్ చేయవచ్చు. కోహ్లీ మూడో స్థానంలో ఆడితే, శివమ్ దూబే నాలుగో స్థానంలో ఆడడం ఖాయం. ఎందుకంటే తొలి టీ20 మ్యాచ్‌లో 40 బంతుల్లో 60 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా చోట్ల, జితేష్ శర్మ వికెట్ కీపింగ్‌తో పాటు ఐదో నంబర్‌లో బ్యాటింగ్ చేస్తాడు. గేమ్ ఫినిషర్‌గా రింకూ సింగ్ కనిపించనుంది.

బౌలింగ్ విభాగం ఎలా ఉంటుందంటే..

అర్ష్‌దీప్ సింగ్ యధావిధిగా పేస్ బౌలింగ్‌ను నడిపించనున్నాడు. ముకేష్‌ కుమార్‌కి తప్పకుండా అవకాశం వస్తుంది. తొలి టీ20 మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ ఖరీదుగా మారాడు. ఈ కారణంగా అతను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తొలగించే అవకాశం ఉంది. అతని స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు జట్టులో అవకాశం లభించవచ్చు. వాషింగ్టన్ సుందర్‌కు ఆల్‌రౌండర్‌గా మరో అవకాశం లభించవచ్చు. ప్లేయింగ్ ఎలెవన్‌లో అక్షర్ పటేల్‌ను కూడా చేర్చవచ్చు.

భారత ప్రాబబుల్ స్క్వాడ్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, జితేష్ శర్మ, రింకూ సింగ్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్, వాషింగ్టన్ సుందర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..