AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Womens Champions Trophy 2027: శ్రీలంక నుంచి భారత్‌కు మారిన మెగా టోర్నీ.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి వేదిక ఖరారు

మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకుంది. శ్రీలంకలో రాజకీయ జోక్యం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది. సొంత గడ్డపై జరగనున్న ఈ తొలి ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ భారత మహిళల క్రికెట్‌కు కొత్త ఊపునివ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Womens Champions Trophy 2027: శ్రీలంక నుంచి భారత్‌కు మారిన మెగా టోర్నీ.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి వేదిక ఖరారు
Womens Champions Trophy 2027
Rakesh
|

Updated on: Sep 02, 2026 | 8:43 PM

Share

Womens Champions Trophy 2027: మహిళల క్రికెట్ చరిత్రలోనే తొలిసారి జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు భారత్‌కు దక్కాయి. రాజకీయ జోక్యం కారణంగా శ్రీలంక నుంచి ఈ హక్కులను రద్దు చేసిన ఐసీసీ, ఈ చారిత్రాత్మక టోర్నీ నిర్వహణను భారత్‌కు అప్పగించింది. 2027 ఫిబ్రవరిలో ఈ ధమాకా క్రికెట్ సమరం జరగనుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ దేశపు క్రికెట్ బోర్డులోనూ ప్రభుత్వ లేదా రాజకీయ జోక్యం ఉండకూడదు. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ బోర్డును అక్కడ ప్రభుత్వం నియమించిన తాత్కాలిక కమిటీ నిర్వహిస్తోంది. ఇది అంతర్జాతీయ క్రికెట్ మండలి నిబంధనలకు స్పష్టమైన ఉల్లంఘన కావడంతో లంక నుంచి ఆతిథ్య హక్కులను రద్దు చేస్తూ ఐసీసీ బుధవారం సంచలన ప్రకటన విడుదల చేసింది. బంగ్లాదేశ్, సౌతాఫ్రికా పోటీ పడినప్పటికీ అంతిమంగా ఆతిథ్య అవకాశాన్ని భారత్ కైవసం చేసుకుంది.

వేదికలు, టోర్నీ నిర్వహణ వివరాలు

తొలిసారిగా టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీకి వడోదరా, ముంబై నగరాలు వేదికలుగా మారనున్నాయి. ముంబైలోని చారిత్రాత్మక బ్రబౌర్న్ స్టేడియంలో ప్రధాన మ్యాచ్‌లు జరగనున్నాయి. 2027 ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 28 వరకు రెండు వారాల పాటు ఈ టోర్నీ జరగనుంది. ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా అగ్రస్థానంలో ఉన్న 6 దేశాలు ఈ సమరంలో తలపడనున్నాయి.

రంగుల కలలా మారనున్న రౌండ్ రాబిన్ సమరం

ఈ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక, న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు పాల్గొననున్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. అంటే ప్రతి జట్టు మిగతా 5 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. మ్యాచ్‌ల పూర్తి టైమ్‌టేబుల్, షెడ్యూల్ వివరాలను త్వరలోనే ఐసీసీ అధికారికంగా ప్రకటించనుంది.

భారత మహిళల జట్టుకు దక్కిన సువర్ణావకాశం

2025 చివరిలో సొంత గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన భారత మహిళల జట్టుకు ఇది మరో గొప్ప అవకాశం కానుంది. స్వదేశీ అభిమానుల ప్రోత్సాహంతో తొలిసారి జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీని కూడా కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాలని భారత్ పట్టుదలతో ఉంది. టి20 ప్రపంచకప్ జరిగిన ఏడాదికే మరో ఐసీసీ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వడం క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్సాహాన్ని నింపుతోంది. సొంత గడ్డపై జరగనున్న ఈ తొలి ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ భారత మహిళల క్రికెట్‌కు కొత్త ఊపునివ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us