T20 World Cup 2021: మెగా ఈవెంట్‌కు వారం రోజులే.. కరోనా కట్టడికి ఐసీసీ కఠిన చర్యలు.. పాజిటివ్‌గా తేలితే ఏం చేస్తారో తెలుసా?

|

Oct 08, 2021 | 6:59 PM

ICC COVID-19 Rules: అక్టోబర్ 17 న ఒమన్ వర్సెస్ పాపువా న్యూ గినియా టీంల మధ్య మ్యాచ్‌తో టీ20 ప్రపంచ కప్‌ మొదలు కానుంది.

T20 World Cup 2021: మెగా ఈవెంట్‌కు వారం రోజులే.. కరోనా కట్టడికి ఐసీసీ కఠిన చర్యలు.. పాజిటివ్‌గా తేలితే ఏం చేస్తారో తెలుసా?
Icc Men's T20 World Cup 2021
Follow us on

T20 World Cup 2021: ఎన్నో ఊహాగానాల అనంతరం 2021 టీ20 ప్రపంచ కప్ అక్టోబర్ 17, ఆదివారం నాడు యూఏఈలో మొదలుకానుంది. పొట్టి ప్రపంచ కప్ మొత్తం నాలుగు వేదికలు- దుబాయ్, అబుదాబి, షార్జా, మస్కట్ దేశాల్లో జరగనుంది. నాలుగు వారాల పాటు జరగనున్న ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. గురువారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ‎ఈ మెగా ఈవెంట్ కోసం 20 మంది అధికారులను ప్రకటించింది.

టీ 20 ప్రపంచ కప్‌లో ఒమన్ వర్సెస్ పాపువా న్యూ గినియా టీంల మధ్య తొలిపోరు జరగనుంది. అయితే, ఈ ఈవెంట్ ప్రారంభానికి ముందు ఐసీసీ అనేక మార్గదర్శకాలను కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో జారీ చేసింది. మహమ్మారి ప్రారంభమైన తర్వాత జరిగిన మొదటి బహుళ దేశాల టోర్నమెంట్ కావడంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకోనుంది. కోవిడ్ కారణంతో బీసీసీఐ ఈ మెగా ఈవెంట్‌ను భారతదేశం నుంచి తరలించాల్సి వచ్చింది.

“16 టీమ్‌ల టోర్నమెంట్ యూఏఈలో జరగనుంది. కోవిడ్-19 కి వ్యతిరేకంగా అత్యధికంగా టీకాలు వేసిన దేశంగా యూఏఈ నిలిచింది. అందుకు ఇక్కడ ఈ మోగా టోర్నీని నిర్వహించనున్నాం” అని ఐసీసీ పేర్కొంది.

2021 టీ 20 ప్రపంచ కప్ మార్గదర్శకాలు
1. మరొక వ్యక్తితో సన్నిహిత సంబంధాలు
ఒక వ్యక్తి లక్షణాలు/పరీక్షకు ముందు కనీసం 15 నిమిషాలు, లేదా 48 గంటల ముందు ఇతర వ్యక్తికి రెండు మీటర్ల దూరంలో నిలబడి ఉన్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు సన్నిహితంగా ఉన్నట్లు పేర్కొంది. పాజిటివ్‌గా తేలితే వారు ఆరు రోజులు ఐసోలేషన్‌లో ఉండాలని పేర్కొంది.

2. వైద్య సదుపాయం
ఒక క్రికెటర్ ఆసుపత్రిని సందర్శించాలనుకుంటే, అతను టోర్నమెంట్‌లోని బయో సెక్యూర్ బబుల్‌లో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను ఉపయోగించుకోవాలి. ఈసారి ఈ మెగా ఈవెంట్‌లో ఆటగాళ్ల మానసిక శ్రేయస్సు కోసం ఐసీసీ ఒక సైకాలజిస్ట్‌ని కూడా నియమించింది.

3. బయో బబుల్‌ను ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది?
స్పష్టమైన మార్గదర్శకాలను ఐసీసీ ఇంకా ప్రస్తావించలేదు. కానీ, మేనేజ్‌మెంట్ ఈ విషయాన్ని “చాలా తీవ్రంగా” పరిగణించాలని మార్షల్ చెప్పారు. అపెక్స్ క్రికెట్ బోర్డు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం జట్లు వెళ్లాలని తాను ఆశిస్తున్నానని కూడా ఆయన తెలిపాడు.

5. ప్రేక్షకులకు రెట్టింపు టీకాలు వేయాల్సిన అవసరం ఉందా?
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను బృందాలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని మార్షల్ చెప్పారు. అబుదాబి, ఒమన్‌లో అభిమానులకు రెట్టింపు టీకాలు వేయించాలి. కానీ, దుబాయ్, షార్జాలో అలాంటి పరిస్థితి లేదు.

6. కుటుంబాలను అనుమతించవచ్చా?
పరిమితంగా కుటుంబ సభ్యులను క్రికెటర్లతో ఉండడానికి అనుమతి ఉందని మార్షల్ తెలిపారు. ఇదే నియమాలను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ అనుసరించినట్లు ఆయన పేర్కొన్నారు.

7. అభిమానులకూ నిబంధనలు
వేదికల వద్ద అభిమానులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. క్రికెటర్లతో నేరుగా సంభాషించడానికి అభిమానులను అనుమతించబోమని మార్షల్ తెలిపారు.

Also Read: RCB vs DC Live Score, IPL 2021: రెండో స్థానంపై కన్నేసిన కోహ్లీ సేన.. మరికొద్దిసేపట్లో ఢిల్లీతో హోరాహోరీ పోరు..!

Deepak Chahar: ఎవరీ జయ భరద్వాజ్.. దీపక్‎ చాహార్‎ ఆమెతో ఎలా లవ్‎లో పడ్డాడు..