Rohit Sharma: ఇందేటి రోహిత్ భయ్యా.. మరీ ఇంత చెత్త రికార్డులో చేరావ్.. మరే కెప్టెన్ ఈ జాబితాలోనే లేడుగా..

Asia Cup 2023: భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, టీమ్ ఇండియాకు 266 పరుగుల విజయ లక్ష్యం ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టీం 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. బంగ్లాదేశ్‌లో కెప్టెన్ షకీబ్ అల్ హసన్, తౌహీద్ హృదయ్ యాభై పరుగుల మార్కును అధిగమించారు.

Rohit Sharma: ఇందేటి రోహిత్ భయ్యా.. మరీ ఇంత చెత్త రికార్డులో చేరావ్.. మరే కెప్టెన్ ఈ జాబితాలోనే లేడుగా..
Rohit Sharma Duck Out

Updated on: Sep 15, 2023 | 9:41 PM

IND vs BAN, Rohit Sharma Record: ఆసియా కప్ సూపర్-4 రౌండ్ చివరి మ్యాచ్ భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతోంది. రెండు జట్లూ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ముఖాముఖిగా తలపడుతున్నాయి. బంగ్లాదేశ్ 265 పరుగులకు సమాధానంగా బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు. రోహిత్ శర్మను తంజిమ్ హసన్ సాకిబ్ అవుట్ చేశాడు. అదే సమయంలో దీని తర్వాత రోహిత్ శర్మ పేరిట ఒక అవమానకరమైన రికార్డు నమోదైంది. రోహిత్ శర్మ ఆసియా కప్ చరిత్రలో మూడోసారి జీరో పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు.

రోహిత్ శర్మ పేరిట నమోదైన చెత్త రికార్డు..

ఆసియా కప్ చరిత్రలో మూడుసార్లు సున్నాకి ఔట్ అయిన తొలి భారత ఆటగాడు రోహిత్ శర్మ. ఇది కాకుండా ఆసియా కప్ చరిత్రలో రెండుసార్లు సున్నాకి ఔట్ అయిన తొలి భారత ఓపెనర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అలాగే రోహిత్ శర్మ పేరిట మరో అవమానకరమైన రికార్డు నమోదైంది. ఆసియా కప్ చరిత్రలో సున్నాకి ఔట్ అయిన మొదటి భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అంతకుముందు, 1988 ఆసియా కప్‌లో దిలీప్ వెంగ్‌సాకర్ కెప్టెన్‌గా సున్నా వద్ద ఔటయ్యాడు.

ఇవి కూడా చదవండి

266 పరుగుల లక్ష్యం.. తడబడుతోన్న టీమిండియా..

భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, టీమ్ ఇండియాకు 266 పరుగుల విజయ లక్ష్యం ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టీం 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. బంగ్లాదేశ్‌లో కెప్టెన్ షకీబ్ అల్ హసన్, తౌహీద్ హృదయ్ యాభై పరుగుల మార్కును అధిగమించారు. భారత్ తరపున ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్ 265 పరుగులకు సమాధానంగా, వార్తలు రాసే సమయానికి భారత జట్టు 33 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ 74, జడేజా 0 ఉన్నారు.

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్(w), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ.

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిటన్ దాస్ (వికెట్ కీపర్), తంజీద్ హసన్ తమీమ్, అన్ముల్ హక్, తౌహీద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, మెహిదీ హసన్ షేక్, నసుమ్ అహ్మద్, తంజీద్ హసన్ షకీబ్, ముష్తాఫిజుర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..