
Highest Totals For ICC Womens T20I World Cup: మహిళల టీ20 క్రికెట్ ప్రపంచకప్లో పరుగుల సునామీ కురుస్తోంది. మైదానంలోకి దిగితే చాలు సిక్సర్లు, ఫోర్ల వర్షంతో బ్యాటర్లు స్టేడియాలను హోరెత్తిస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్, భారత్ జట్లు సృష్టించిన సునామీతో ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ల రికార్డులు మారిపోతున్నాయి. ఆ ఆల్-టైమ్ రికార్డుల వివరాలు ఓసారి చూద్దాం..
మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2026 జూన్ 12న బర్మింగ్హామ్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు లంక బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి ఏకంగా 219 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఓవర్ కి 10.95 రన్ రేట్తో సాగిన ఈ ఇన్నింగ్స్ ఉమెన్స్ క్రికెట్ హిస్టరీలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. బౌండరీల వర్షం కురిపించిన ఇంగ్లాండ్ టీమ్, ఆ మ్యాచ్లో ఘనవిజయం సాధించి చరిత్ర పుటల్లోకెక్కింది.
కేవలం ఈ ఏడాదే కాదు, గతంలోనూ ఇంగ్లాండ్ జట్టు ఇలాంటి పరుగుల విధ్వంసాన్నే సృష్టించింది. ఈ జాబితాలో రెండో స్థానం కూడా ఇంగ్లాండ్ ఖాతాలోనే ఉంది. 2023 ఫిబ్రవరి 21న కేప్ టౌన్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో ఇంగ్లాండ్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. పాక్ బౌలింగ్ను చీల్చిచెండాడుతూ 10.65 రన్ రేట్తో ఈ స్కోరును నమోదు చేశారు. ఈ మ్యాచ్లోనూ ఇంగ్లాండ్ ఘన విజయాన్ని అందుకుంది.
Innings Break!
A power-packed batting display gives the #WomenInBlue our highest team total in ICC Women’s T20 World Cups 🔥👏
Scorecard ▶️ https://t.co/FMkrKB1zcS#TeamIndia | #T20WorldCup | #INDvNED pic.twitter.com/5IjJUxqP3B
— BCCI Women (@BCCIWomen) June 17, 2026
ఇక తాజాగా లీడ్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు (India Women) సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. నెదర్లాండ్స్ (NL Women) జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో టీమిండియా బ్యాటర్లు చెలరేగి ఆడారు. 20 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచారు. 10.45 రన్ రేట్తో భారత బ్యాటర్లు బౌండరీలు, సిక్సర్లతో విరుచుకపడ్డారు. వరల్డ్ కప్ హిస్టరీలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్ల జాబితాలో టీమిండియా సగర్వంగా టాప్ 3 లో నిలిచింది. ఇంగ్లాండ్ ఆధిపత్యానికి గట్టి పోటీ ఇస్తూ భారత్ సాధించిన ఈ స్కోరు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది.
మహిళల టీ20 ప్రపంచకప్లో అత్యధిక స్కోరు రికార్డు ఇంగ్లాండ్ (219/1) పేరిట ఉంది.
నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.
మొదటి రెండు స్థానాల్లో ఇంగ్లాండ్ (219/1, 213/5) ఉండగా, మూడో స్థానంలో భారత్ (209/5) నిలిచింది.
2026 జూన్ 12న బర్మింగ్హామ్ వేదికగా శ్రీలంక మహిళల జట్టుపై ఇంగ్లాండ్ ఈ రికార్డు స్కోరును నమోదు చేసింది.
ఈ మ్యాచ్ 2023 ఫిబ్రవరి 21న కేప్ టౌన్ వేదికగా జరిగింది.