
ఇంగ్లాండ్ జట్టుకు భారత్తో జరిగే తొలి టెస్టుకు ముందు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జూన్ 20న లీడ్స్ వేదికగా ప్రారంభం కానున్న ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్కు స్టార్ పేసర్ గస్ అట్కిన్సన్ అందుబాటులో ఉండటం సందేహాస్పదంగా మారింది. ఈ విషయాన్ని బిబిసి నివేదిక ద్వారా వెల్లడించింది. కుడి తొడ కండరాల నొప్పి కారణంగా అతను జట్టులోకి రాలేని అవకాశం ఉందని తెలిపింది. ఇంగ్లాండ్ పేస్ విభాగంలో ఇప్పటికే గాయాల సమస్యలు మిన్నడుతున్న నేపథ్యంలో, అట్కిన్సన్ అందుబాటులో లేకపోవడం వారి గాయం సమస్యలను మరింత తీవ్రముగా చేస్తుంది.
27 ఏళ్ల గస్ అట్కిన్సన్ గత నెల జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్ట్ సందర్భంగా గాయపడ్డాడు. ఆ గాయం కారణంగా ఆయన వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్కు దూరంగా ఉన్నారు. అయినా ఆ సిరీస్ను ఇంగ్లాండ్ 3-0 తేడాతో గెలుచుకుంది. ఇప్పటి వరకు అట్కిన్సన్ 12 టెస్టుల్లో ఆడి మూడు సార్లు ఐదు వికెట్లు పడగొట్టి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అతను ఇంగ్లాండ్ బౌలింగ్ విభాగంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు.
ఇక అట్కిన్సన్ కోలుకోకపోతే, ఇప్పటికే గాయాలతో బాధపడుతున్న మరో ఇద్దరు పేసర్లు మార్క్ వుడ్, ఆలీ స్టోన్లపై భారాన్ని పెంచాల్సి వస్తుంది. దీనికితోడు, జోఫ్రా ఆర్చర్ కూడా బొటనవేలు గాయం కారణంగా టెస్ట్ క్రికెట్లోకి తిరిగి రావడాన్ని ఆలస్యం చేస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ కలిపి ఇంగ్లాండ్కు భారత్తో సిరీస్కు ముందు బలహీనతలుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగం ఇప్పటినుంచి గాయాల బెడదతో కుంగిపోతుండటంతో, ఐదు టెస్టుల ఈ సిరీస్ ఇంగ్లాండ్కు గట్టి పరీక్షగా మారనుంది.
ఇంగ్లాండ్ పేస్ దళం ఇప్పటికే ఒత్తిడికి గురవుతున్న తరుణంలో అట్కిన్సన్ గాయం తీవ్రంగా ప్రభావితం చేసే అంశంగా మారుతోంది. భారత బ్యాటింగ్ లైనప్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ లాంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్న తరుణంలో, ఇంగ్లాండ్కు ఒక ఫిట్ అండ్ ఫైర్ పేసర్ అవసరం. గత సిరీసుల్లో ఆత్మవిశ్వాసాన్ని చాటిన అట్కిన్సన్ వంటి బౌలర్ అందుబాటులో లేకపోతే, ఇంగ్లాండ్ జట్టు వ్యూహాత్మకంగా వెనుకబడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా లీడ్స్ వేదిక స్పిన్కు అంతగా అనుకూలించకపోవడం, పేస్ బౌలింగ్ పాత్ర కీలకమవుతుండటంతో, అట్కిన్సన్ గైర్హాజరు ఇంగ్లాండ్కు ప్రధాన ఆందోళనగా మారింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..