100, 200 లే కాదు.. 5 కూడా లేదు భయ్యో.. IND vs PAK పోరులో ఈ లెక్కలు మిస్సయితే మజానే ఉండదంతే..

India vs Pakistan, 27th Match, Group A, ICC Men's T20 World Cup 2026: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్లు కొలంబోలో తలపడేందుకు సిద్ధమయ్యాయి. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు భారత్, పాక్ పోరులో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

100, 200 లే కాదు.. 5 కూడా లేదు భయ్యో.. IND vs PAK పోరులో ఈ లెక్కలు మిస్సయితే మజానే ఉండదంతే..
Ind Vs Pak Interesting Facts

Updated on: Feb 15, 2026 | 3:21 PM

India vs Pakistan, 27th Match, Group A, ICC Men’s T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. అయితే, ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లను గమనిస్తే భారత జట్టుదే ఆధిపత్యంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఇరుజట్లు తలపడగా.. ఏడుసార్లు భారత జట్టే గెలిచింది. దీంతో భారత జట్టు 7-1తో ఆధిక్యంలో ఉంది. అయితే, ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లను గమనిస్తే.. రెండు జట్లు విజయం కోసం తీవ్రంగా పోరాడాయి. చివరి బంతి వరకు మ్యాచ్ జరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. రెండు జట్లు ఇప్పటివరకు 16 టీ20 మ్యాచ్‌లు ఆడాయి. కానీ ఏ జట్టు కూడా 200 పరుగులు చేయలేకపోయాయి. ఏ ఆటగాడు కూడా సెంచరీ చేయలేకపోవడం గమనార్హం. ఏ బౌలర్ కూడా ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీయలేదు. ఇలాంటి విశేషాలు ఎన్నో భారత, పాక్ మ్యాచ్ లో చోటు చేసుకున్నాయి. ఆవివరాలు ఓసారి చూద్దాం..

2007లో రెండుసార్లు ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్‌లు ప్రేక్షకుల ఊపిరి బిగపట్టేలా చేశాయి. టీ20 ప్రపంచ కప్ తొలిసారిగా 2007లో జరిగింది. దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో, భారత్ వర్సెస్ పాకిస్తాన్ రెండుసార్లు తలపడ్డాయి. మొదటిసారి లీగ్ మ్యాచ్‌ ఢీ కొట్టాయి. ఈ మ్యాచ్ టై అయింది. భారత జట్టు బౌల్ అవుట్‌లో గెలిచింది. అప్పుడు సూపర్ ఓవర్లు లేవు. భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. పాకిస్తాన్ కూడా రెండవ ఇన్నింగ్స్‌లో 141 పరుగులు మాత్రమే చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత, బౌల్-అవుట్ జరిగింది. ఇందులో, భారత జట్టు నుంచి రాబిన్ ఉతప్ప, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ స్టంప్‌లను పడకొట్టారు. ముగ్గురు పాకిస్తాన్ బౌలర్లు లక్ష్యాన్ని చేరుకోలేదు.

ఆ తర్వాత ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడ్డాయి. ఈసారి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. పాకిస్తాన్ స్కోరుకు దగ్గరగా వచ్చింది. కానీ 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌట్ అయింది.

2012 నుంచి 2022 వరకు, ఛేజింగ్ జట్టు గెలిచింది. 2012లో, కొలంబో మైదానంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, 19.4 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ సహాయంతో భారత జట్టు 17 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది.

2014లో మీర్పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ 7 వికెట్లకు 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సులభంగా చేరుకుంది. ఈ మ్యాచ్ కూడా ఏకపక్షంగా జరిగింది.

2016లో కోల్‌కతా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించారు, పాకిస్తాన్ 5 వికెట్లకు 118 పరుగులు చేసింది. భారత్ 15.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి మ్యాచ్‌ను గెలిచింది.

2021లో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్తాన్ 17.5 ఓవర్లలో ఎటువంటి నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుంది. మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ రికార్డు స్థాయిలో 152 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.

2022లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. భారత్ కేవలం 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అక్కడి నుంచి హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ బాధ్యత తీసుకున్నారు. చివరి బంతి వరకు జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 82 పరుగులు చేసి భారత్‌ను 4 వికెట్ల తేడాతో విజయం వైపు నడిపించాడు.

2024లో, చివరి బంతి వరకు పోరాటం సాగింది. 2024లో, న్యూయార్క్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 19 ఓవర్లలో భారత్ 119 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ వరుసగా రెండో ఓటమి అంచున ఉంది. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా బంతితో తిరిగి వచ్చి పాకిస్తాన్‌ను 113 పరుగులకే పరిమితం చేశారు.

రెండు జట్ల మధ్య జరిగిన ఎనిమిది ప్రపంచ కప్ మ్యాచ్‌లలో 159 పరుగులు తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు . 2022లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్తాన్ చేసిన 159 పరుగులు తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు. అయితే, భారతదేశం దానిని ఛేదించింది. 2016లో పాకిస్తాన్ చేసిన 118 పరుగులు ఇరు జట్ల మధ్య అత్యల్ప స్కోరు. వర్షం కారణంగా మ్యాచ్‌ను ఒక్కొక్కటి 18 ఓవర్లకు కుదించారు.

ఛేజింగ్ టీం సక్సెస్ రేటు 75%గా ఉంది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్లు ఇప్పటివరకు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 16 సార్లు మాత్రమే తలపడ్డాయి. అంటే, ఈ ఫార్మాట్‌లో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లలో సగం ప్రపంచ కప్‌లలో జరగడం గమనార్హం. ఈ 16 మ్యాచ్‌లలో భారత జట్టు 13 సార్లు గెలిచింది. పాకిస్తాన్ 3 సార్లు మాత్రమే ఫలితాన్ని సాధించగలిగింది.

ప్రపంచ కప్‌లో, టీమిండియా పాకిస్తాన్‌పై 3 మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసి, 4 మ్యాచ్‌ల్లో ముందుగా బౌలింగ్ చేసి గెలిచింది. పాకిస్తాన్ 2021లో రెండవ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ ఏకైక విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..