AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : వీళ్లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. బెంచ్ మీద కూర్చోని కూడా సిరీస్ ముగించిన టీమిండియా ప్లేయర్స్ వీళ్లే

భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఆండర్సన్-టెండూల్కర్ టెస్ట్ సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. ఈ సిరీస్‌లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, చివరి టెస్టును గెలిచి సిరీస్‌ను డ్రా చేసింది. అయితే, ఈ సిరీస్‌లో జట్టుతో ఉన్నప్పటికీ, కొందరు ఆటగాళ్లకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం దొరకలేదు.

IND vs ENG : వీళ్లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. బెంచ్ మీద కూర్చోని కూడా సిరీస్ ముగించిన టీమిండియా ప్లేయర్స్ వీళ్లే
Ind Vs Eng Series
Rakesh
|

Updated on: Aug 05, 2025 | 3:42 PM

Share

IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ డ్రాగా ముగిసింది. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణల అద్భుతమైన బౌలింగ్, శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా చివరి టెస్టును 6 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. అయితే, ఈ సిరీస్‌లో జట్టుతో ఉండి, నెట్స్‌లో కష్టపడినా ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కని కొందరు ఆటగాళ్లు ఉన్నారు. బెంచ్‌పై కూర్చుని జట్టు విజయాన్ని వీక్షించిన ఆ ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

అభిమన్యు ఈశ్వరన్

బెంగాల్‌కు చెందిన బ్యాట్స్‌మెన్ అభిమన్యు ఈశ్వరన్, ఇండియా ‘A’ తరపున అనేక విదేశీ పర్యటనలు చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డులు కలిగి ఉన్న ఈశ్వరన్, ఇండియా ‘A’ కెప్టెన్‌గా కూడా రాణించాడు. 2022లో మొదటిసారి భారత టెస్ట్ జట్టులో చోటు దక్కినా, ఇప్పటివరకు అరంగేట్రం చేయలేదు. ఈ ఇంగ్లాండ్ పర్యటనలోనూ రిజర్వ్ ఓపెనర్‌గా ఉన్నాడు. కానీ యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్ల మంచి ఫామ్ కారణంగా అతనికి అవకాశం దక్కలేదు.

కుల్దీప్ యాదవ్

రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌ల స్పిన్ ద్వయం మొత్తం సిరీస్‌లో ఆడింది. కానీ కుల్దీప్ యాదవ్ లాంటి సీనియర్ స్పిన్నర్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వలేదు. రవిచంద్రన్ అశ్విన్ అందుబాటులో లేకపోయినా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్ కుల్దీప్‌ను పక్కన పెట్టారు. ప్రతి మ్యాచ్‌కు ముందు కుల్దీప్‌కు అవకాశం దక్కుతుందని ఆశించినా, నిరాశే మిగిలింది. కుల్దీప్‌కు అవకాశం ఇచ్చి ఉంటే, సిరీస్ భారత్ వైపు మొగ్గు చూపేదని చాలామంది క్రికెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.

అర్షదీప్ సింగ్

సీనియర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా మూడు టెస్టులు మాత్రమే ఆడాల్సి వచ్చింది. దీంతో యువ పేసర్ అర్షదీప్ సింగ్‌కు టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం వస్తుందని అందరూ భావించారు. కానీ జట్టు కూర్పు, పిచ్ పరిస్థితుల కారణంగా అతనికి కూడా బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ యువ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ ప్రతిభ గురించి అందరికీ తెలుసు, కానీ ఓవల్ చివరి టెస్ట్ వరకు కూడా అతనికి అవకాశం దక్కలేదు.

నారాయణన్ జగదీషన్

ఈ జాబితాలో నారాయణన్ జగదీషన్ పేరు కూడా ఉంది. చివరి టెస్టు కోసం అతను జట్టులో చేరినప్పటికీ, పంత్ గాయం కారణంగా వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్ ఉన్నాడు. దీంతో జగదీషన్‌కు అవకాశం దక్కలేదు.

ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఎవరి దగ్గర ఉంది?

ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ మొదటిసారిగా నిర్వహించబడింది. 2024లో భారత్ 4-1తో గెలిచినా, ఆ సిరీస్‌ను ఈ ట్రోఫీలో పరిగణించలేదు. టెస్ట్ సిరీస్ డ్రా అయినప్పుడు ట్రోఫీ చివరి మ్యాచ్ జరిగిన దేశంలోనే ఉంటుంది. ఈ సిరీస్ ఇంగ్లాండ్‌లో ముగియడంతో ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ప్రస్తుతం ఇంగ్లాండ్ దగ్గరే ఉంటుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..