ఆతిథ్యం అదిరిపోలే.. ఫిదా అయిన ఇంగ్లాండ్ జట్టు.. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి మురిసిపోతున్న ప్లేయర్స్..
INDIA VS ENGLAND: భారత్- ఇంగ్లాండ్ మధ్య చెన్నై వేదికగా చెపాక్ స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో
INDIA VS ENGLAND: భారత్- ఇంగ్లాండ్ మధ్య చెన్నై వేదికగా చెపాక్ స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ డబుల్ సెంచరీ చేసి మంచి ఫాంలో ఉన్నాడు. ఆట ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ ఆటగాళ్లు లీలా ప్యాలెస్ హోటల్కి వెళ్లారు. అక్కడ హోటల్ సిబ్బంది ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్కి ఘన స్వాగతం పలికారు.
అతడికి బొకే ఇచ్చి కేక్ కటింగ్కు ఏర్పాట్లు చేశారు. రూట్ బస్సు దిగగానే ఆటగాళ్లంతా కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. అనంతరం కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశాడు. ఈ వీడియోను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ సామాజిక మాధ్యమాల్లో పంచుకొని మురిసిపోయింది. రూట్కు భారత ఆతిథ్యం అదిరిపోయిందని పేర్కొని ధన్యవాదాలు చెప్పింది.
Indian hospitality for @root66 – thank you ???
Day 2 Highlights: https://t.co/9G6YJG1Unx #INDvENG pic.twitter.com/5eHk1EzoF2
— England Cricket (@englandcricket) February 6, 2021