ENG vs BAN: ప్రపంచ ఛాంపియన్‌కు భారీ షాక్.. టీ20 సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్..

ENG vs BAN 2nd T20I: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు టీ20 సిరీస్‌ను కోల్పోయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.

ENG vs BAN: ప్రపంచ ఛాంపియన్‌కు భారీ షాక్.. టీ20 సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్..
Ban Vs Eng

Updated on: Mar 13, 2023 | 7:37 AM

ENG vs BAN T20I Series: టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. 2022లో టీ20 ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్ టీం.. బంగ్లాదేశ్ చేతిలో టీ20 సిరీస్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మూడు టీ20ల సిరీస్‌లో బంగ్లాదేశ్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ను ఓడించి 2-0తో అజేయంగా ఆధిక్యంలో నిలిచింది. ఆతిథ్య బంగ్లాదేశ్‌ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 6 వికెట్ల తేడాతో, రెండో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ జట్టుకు గేమ్ ఛేంజర్‌గా మారాడు.

మెహిదీ హసన్ మిరాజ్ మొదట బౌలింగ్ చేస్తూ, 4 ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తరువాత 5వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ, 2 సిక్సర్ల సహాయంతో 20 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్ ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగింది.

ఆరంభం నుంచి బలహీనంగానే ఇంగ్లాండ్ జట్టు..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో 117 పరుగులకే 10 వికెట్లు కోల్పోయింది. జట్టు తరపున బెన్ డకెట్ 2 ఫోర్ల సాయంతో 28 పరుగులతో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. ఇది కాకుండా ఫిలిప్ సాల్ట్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 25 పరుగులు జోడించాడు. అదే సమయంలో మొయిన్ అలీ 15, సామ్ కుర్రాన్ 12, రెహాన్ అహ్మద్ 11 పరుగులు చేశారు. ఇది కాకుండా ఏ బ్యాట్స్‌మెన్ కూడా రెండంకెల స్కోరును దాటలేకపోయారు.

ఇవి కూడా చదవండి

బౌలింగ్‌లో అదరగొట్టిన బంగ్లాదేశ్..

బంగ్లాదేశ్‌ నుంచి అద్భుతమైన బౌలింగ్‌ కనిపించింది. మెహదీ హసన్ మిరాజ్ 4 ఓవర్లలో 12 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాటు తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్, హసన్ మహమూద్, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తలో వికెట్ తీశారు.

తుఫాన్ ఇన్నింగ్ ఆడిన నజ్ముల్ హుస్సేన్ శాంటో..

118 పరుగుల ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ జట్టు ఆదిలోనే తడబడినట్లు కనిపించింది. ఆ జట్టులోని ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ ఇద్దరూ 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్‌కు చేరుకున్నారు. అనంతరం మూడో స్థానంలో వచ్చిన నజ్ముల్ హుస్సేన్ శాంటో 3 ఫోర్ల సాయంతో 46 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయపథంలోకి చేర్చాడు. దీంతో పాటు మెహదీ హసన్ మిరాజ్ 2 సిక్సర్ల సాయంతో జట్టుకు 20 పరుగులు జోడించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us