Dhanashree Verma : నా పరువు తీసి నీ ఇమేజ్ పెంచుకుంటున్నావా? మాజీ భర్త చాహల్‌పై ధనశ్రీ వర్మ ఆగ్రహం!

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల మధ్య సంబంధం ముగిసినప్పటికీ, వారిద్దరి మధ్య కోల్డ్ వార్ ఇంకా కొనసాగుతోంది. విడాకుల తర్వాత చాహల్ ఒక పాడ్‌కాస్ట్‌లో తమ బంధం గురించి మాట్లాడారు. తాజాగా ధనశ్రీ వర్మ కూడా ఓ షోలో పాల్గొని తమ బంధం గురించి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మాజీ భర్తపై పరోక్షంగా వార్నింగ్ కూడా ఇచ్చారు.

Dhanashree Verma : నా పరువు తీసి నీ ఇమేజ్ పెంచుకుంటున్నావా? మాజీ భర్త చాహల్‌పై ధనశ్రీ వర్మ ఆగ్రహం!
Dhanashree Verma Reacts To Yuzvendra Chahal

Updated on: Sep 09, 2025 | 10:07 AM

Dhanashree Verma : భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల మధ్య విడాకుల తర్వాత కూడా కోల్డ్ వార్ కొనసాగుతోంది. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో చాహల్ తమ బంధం, విడాకుల గురించి మాట్లాడారు. ఆ పాడ్‌కాస్ట్‌లో షుగర్ డాడీ టీ-షర్ట్‌పై కూడా ఆయన వివరణ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ధనశ్రీ వర్మ కూడా అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్‌లోని రైజ్ అండ్ ఫాల్ అనే షోలో పాల్గొన్నారు. ఆ షోలో ఆమె తన విడాకులు, బంధం గురించి మరోసారి ఓపెన్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తన మాజీ భర్త యుజ్వేంద్ర చాహల్‌కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.

ధనశ్రీ వర్మ ఏమన్నారంటే?

షోలో ఒక కంటెస్టెంట్ ధనశ్రీ వర్మను మీరు పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన విషయాల పట్ల సంతృప్తిగా ఉన్నారా అని అడగ్గా, ఆమె పూర్తిగా సంతృప్తిగా లేనని సమాధానం ఇచ్చారు. ఆమె ఇలా అన్నారు: “ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత అన్నింటినీ ముగించాలని నిర్ణయించుకున్నారు. అలాంటప్పుడు తర్వాత ఇలా ఎందుకు మాట్లాడుకోవాలి? ప్రతి ఒక్కరికీ వారి పరువు వారి చేతిలో ఉంటుంది. ఒక పెళ్లిలో ఉన్నప్పుడు, భాగస్వామి పరువు కూడా మన చేతిలోనే ఉంటుంది. నేను కూడా వచ్చి అగౌరవంగా మాట్లాడొచ్చు. నేను ఒక మహిళని, నాకు మాట్లాడటానికి ఏమీ ఉండవని మీరు అనుకుంటున్నారా? కానీ అతను నా భర్త. అప్పట్లో కూడా నేను అతన్ని గౌరవించాను. ఇప్పుడు కూడా గౌరవించాల్సి ఉంటుంది” అని అన్నారు.

పరువు తీసి ఇమేజ్ పెంచుకోవాలా?

ధనశ్రీ వర్మ వ్యాఖ్యలకు షోలోని ఇతర కంటెస్టెంట్లు కూడా మద్దతు ఇచ్చారు. బంధం ముగిసిన తర్వాత ఒకరి గురించి తప్పుగా మాట్లాడటం మంచి విషయం కాదని వారు అన్నారు. దీనిపై ధనశ్రీ వర్మ స్పందిస్తూ.. మిమ్మల్ని మీరు మంచిగా చూపించుకోవాలనుకుంటే మీ పనితో చూపించుకోండి. వేరొకరిని కించపరచి మీ ఇమేజ్‌ను ఎందుకు పెంచుకోవాలి ? అని ఆమె ప్రశ్నించారు. అలాగే, తనపై నెగెటివ్ పీఆర్ చేస్తున్నారని పరోక్షంగా ఆరోపించారు. “ఈ విషయాలన్నీ మీకు ఏ విధంగానూ సాయపడవు” అని ఆమె అన్నారు.

అనుభవం నుంచి నేర్చుకున్నాను

షోలో ధనశ్రీ వర్మ మాట్లాడుతూ.. “ఎవరూ ఏమీ మాట్లాడనప్పుడు ఇమేజ్‌ను ఎందుకు పెంచుకోవాలి?” అని అన్నారు. ఇద్దరి మధ్య గౌరవం ఉండాలని చెప్పారు. “నేనేదైనా చేస్తే ఎవరూ ఏమీ అనరు, నాకు ఎలాంటి భయం లేదు. అయినా కూడా ఉద్దేశపూర్వకంగా వచ్చి మాట్లాడాలి అనుకుంటే, పర్లేదు” అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలన్నీ ఆమె చాహల్‌ను ఉద్దేశించి చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. విడాకుల తర్వాత ధనశ్రీ వర్మ మొదటిసారి ఇంత ఓపెన్‌గా మాట్లాడారు. ఈ బంధం నుంచి తాను చాలా నేర్చుకున్నానని ఆమె తెలిపారు.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..