AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేంటి బ్రో.. మరీ ఇంత బ్యాడ్ లక్‌.. హాఫ్ సెంచరీలతో సత్తా చాటినా.. ఐపీఎల్ సిక్సర్ల హీరోకు హ్యాండిస్తోన్న రిజల్ట్స్..

East Zone vs Central Zone: డొమెస్టిక్ యార్డ్‌లో జరుగుతున్న దేవధర్ ట్రోఫీ టోర్నీలో సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ జట్టు విజయం సాధించింది.

ఇదేంటి బ్రో.. మరీ ఇంత బ్యాడ్ లక్‌.. హాఫ్ సెంచరీలతో సత్తా చాటినా.. ఐపీఎల్ సిక్సర్ల హీరోకు హ్యాండిస్తోన్న రిజల్ట్స్..
Deodhar Trophy 2023 Rinku Singh
Venkata Chari
|

Updated on: Jul 24, 2023 | 8:29 PM

Share

పుదుచ్చేరిలో జరుగుతున్న దేవధర్ ట్రోఫీ 2వ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్‌పై ఈస్ట్ జోన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ కెప్టెన్ సౌరభ్ తివారీ టాస్ గెలిచి సెంట్రల్ జోన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మొదట బ్యాటింగ్ చేసిన సెంట్రల్ జోన్ మంచి ఆరంభాన్ని పొందడంలో విఫలమైంది. ఓపెనర్ మాధవ్ కౌశిక్ 13 పరుగులు చేసి ఔట్ కాగా, యశ్ దూబే 17 పరుగులకే ఇన్నింగ్స్ ముగించాడు.

జట్టు కెప్టెన్ వెంకటేష్ అయ్యర్ (8)ను ఆరంభంలోనే ఔట్ చేయడంలో షాబాజ్ అహ్మద్ సఫలమయ్యాడు. ఈ సమయంలో 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సెంట్రల్ జోన్‌కు రింకూ సింగ్ తోడుగా నిలిచాడు.

ఆచితూచి బ్యాటింగ్ చేసిన రింకూ సింగ్.. స్లో బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాడు. సింగిల్స్‌పై ఫోకస్ చేసి జట్టు స్కోరును పెంచడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రింకూ సింగ్ 63 బంతుల్లో 2 సిక్సర్లు, 1 ఫోర్ తో 54 పరుగులు చేసి మురాసింఘే చేతికి చిక్కాడు.

ఇవి కూడా చదవండి

రింకూకు వికెట్ లభించడంతో ఈస్ట్ జోన్ బౌలర్లు మ్యాచ్‌పై పట్టు సాధించి సెంట్రల్ జోన్ జట్టును 50 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ చేశారు. ఈస్ట్ జోన్ తరపున మురాసింగ్, ఆకాశ్ దీప్, షాబాజ్ అహ్మద్ తలో 3 వికెట్లు తీసి మెరిశారు.

208 పరుగుల సులువైన విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్ జోన్ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్, ఉత్కర్ష్ సింగ్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 91 పరుగులు చేసిన తర్వాత అభిమన్యు ఈశ్వరన్ (38) ఔటయ్యాడు.

మరోవైపు అర్ధసెంచరీతో ఆకట్టుకున్న ఉత్కర్ష్ సింగ్ 104 బంతుల్లో 3 సిక్సర్లు, 11 ఫోర్లతో 89 పరుగులు చేశాడు. ఈ సమయంలో, ఆదిత్య భారీ షాట్ విఫలం కావడంతో, పెవిలియన్ చేరాడు. దీంతో సెంచరీని కోల్పోయాడు.

నాలుగో నంబర్‌లో బరిలోకి దిగని సుభ్రాంశు సేనాపతి 46.1 ఓవర్లలో అజేయంగా 33 పరుగులు చేశాడు. దీంతో ఈస్ట్ జోన్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈస్ట్ జోన్ ప్లేయింగ్ 11: విరాట్ సింగ్, సౌరభ్ తివారీ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సుభ్రాంశు సేనాపతి, కుమార్ కుషాగ్రా (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, మణిశంకర్ మురాసింగ్, ఆకాశ్ దీప్, అవినోవ్ చౌదరి, ముఖ్తార్ హుస్సేన్, ఉత్కర్ష్ సింగ్.

సెంట్రల్ జోన్ ప్లేయింగ్ 11: వెంకటేష్ అయ్యర్ (కెప్టెన్), ఆర్యన్ జుయల్ (వికెట్ కీపర్), మాధవ్ కౌశిక్, రింకూ సింగ్, యశ్ దూబే, శివమ్ మావి, శివమ్ చౌదరి, కర్ణ్ శర్మ, ఆదిత్య సర్వతే, అనికేత్ చౌదరి, యశ్ ఠాకూర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..