‘బెస్ట్ ఆఫ్ త్రీ’ పెట్టాల్సింది.. టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్‌పై కోచ్ రవిశాస్త్రి కామెంట్

|

Jun 03, 2021 | 5:39 AM

Coach Ravi Shastri: వరల్డ్ టెస్టు ఛాంఫియన్​షిప్( WTC final) విజేతను తేల్చేందుకు ఫైనల్లో 'బెస్ట్ ఆఫ్ త్రీ'విధానం ఉంటే బాగుండేది అని టీమిండియా కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతానికి ఇలా

బెస్ట్ ఆఫ్ త్రీ పెట్టాల్సింది.. టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్‌పై కోచ్ రవిశాస్త్రి కామెంట్
Follow us on

వరల్డ్ టెస్టు ఛాంఫియన్​షిప్( WTC final) విజేతను తేల్చేందుకు ఫైనల్లో ‘బెస్ట్ ఆఫ్ త్రీ’విధానం ఉంటే బాగుండేది అని టీమిండియా కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతానికి ఇలా జరిగినప్పటికీ, భవిష్యత్తులో మాత్రం ఫైనల్‌ల్లో మూడు మ్యాచ్‌ల విధానం పెట్టాలని సూచించాడు. ఇంగ్లాండ్​ బయలుదేరే ముందు మీడియా సమావేశంలో రవిశాస్త్రి తన అభిప్రయాన్ని వ్యక్తం చేశాడు.

టెస్టు ఛాంపియన్​షిప్‌ను కొనసాగించాలని ఐసీసీ భావిస్తే.. ఫైనల్‌లో ఒక్క మ్యాచ్​ కాకుండా ‘బెస్ట్ ఆఫ్ త్రీ’ పెడితే బాగుంటుంది. ఇక్కడివరకు వచ్చేందుకు టీమిండియా ఆటగాళ్లు చాలా శ్రమించారు. రాత్రికి రాత్రే దక్కిన విజయం ఇది కాదు ప్రస్తుతం స్వదేశంలో క్వారంటైన్‌లో ఉన్న టీమిండియా.. గురవారం వేకువజామున ఇంగ్లాండ్​కు పయనమవుతుంది. జూన్ 18న ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిఫ్ ఫైనల్ , ఆ తర్వాత ఇంగ్లీష్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్​ ఆడుతుంది.