Team India: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ.. బుమ్రా, అయ్యర్‌ల హెల్త్‌పై కీలక అప్‌డేట్..

|

Apr 15, 2023 | 9:33 PM

Jasprit Bumrah and Shreyas Iyer: IPL 2023 మధ్య, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్‌లకు సంబంధించి కీలక అప్ డేట్ అందించింది.

Team India: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ.. బుమ్రా, అయ్యర్‌ల హెల్త్‌పై కీలక అప్‌డేట్..
Jasprit Bumrah Shreyas Iyer
Follow us on

IPL 2023 మధ్య, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్‌లకు సంబంధించి కీలక అప్ డేట్ అందించింది. బుమ్రా చాలా కాలంగా గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా అతను క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉన్నాడు. బుమ్రా వెన్నుముకకు శస్త్రచికిత్స విజయవంతమైంది. అతను ఇప్పుడు నొప్పి నుంచి కోలుకున్నాడంట. దీంతో పాటు అయ్యర్ గాయంపై బీసీసీఐ కూడా ట్వీట్ ద్వారా సమాచారాన్ని అందించింది.

టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను సెప్టెంబర్ 2022లో ఆడాడు. అప్పటి నుంచి బుమ్రా గాయం కారణంగా క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో బుమ్రా ఐపీఎల్ 2023 మొత్తం టోర్నీ నుంచి తప్పుకున్నాడు.

ఇవి కూడా చదవండి

బుమ్రా 6 వారాల శస్త్రచికిత్స తర్వాత పునరావాసం ప్రారంభించాలని ఫాస్ట్ బౌలర్ బుమ్రాకు వైద్యులు సూచించారు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో బుమ్రా తన పునరావాస నిర్వహణను ప్రారంభించాడని బీసీసీఐ పేర్కొంది.

అదే సమయంలో శ్రేయాస్ అయ్యర్ వెన్నులో గాయం గురించి కూడా బీసీసీఐ తెలియజేసింది. అయ్యర్‌కి వచ్చే వారం సర్జరీ చేయాల్సి ఉందని, ఆ తర్వాత 2 వారాలు విశ్రాంతి తీసుకుని, NCAలో చేరతాడని పేర్కొంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..