Womens IPL: మహిళల ఐపీఎల్ జట్లకు టెండర్లు.. మొత్తం ఐదు టీంలు.. పూర్తి వివరాలు ఇవే..

Womens IPL Teams: బీసీసీఐ త్వరలో 5 ఐపీఎల్ జట్లకు టెండర్లు జారీ చేశారు. ఇక అన్ని జట్ల బేస్ ధర రూ.400 కోట్లుగా ప్రకటించారు.

Womens IPL: మహిళల ఐపీఎల్ జట్లకు టెండర్లు.. మొత్తం ఐదు టీంలు.. పూర్తి వివరాలు ఇవే..
Womens Ipl

Updated on: Nov 29, 2022 | 7:30 PM

క్రికెట్ అభిమానులకు శుభవార్త. మహిళల IPL మొదటి ఎడిషన్ మార్చి 2023లో నిర్వహించనున్నారు. ఇందుకోసం బీసీసీఐ త్వరలో 5 ఐపీఎల్ జట్లకు టెండర్లు జారీ చేయనుంది. ఇక అన్ని జట్ల బేస్ ధర రూ.400 కోట్లుగా ఉండనుంది. బీసీసీఐ త్వరలో ఈ-వేలానికి టెండర్‌ను జారీ చేయనుంది. ఐపీఎల్‌లో ఇప్పటికే ఉన్న జట్లు కూడా ఇందులో పాల్గొనవచ్చు. వాస్తవానికి, అక్టోబర్ 18న జరిగిన బీసీసీఐ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది బీసీసీఐకి 91వ సమావేశం.

మహిళల ఐపీఎల్‌ ఫార్మాట్‌ ఇదే..

మహిళల ఐపీఎల్‌ను 2023 నుంచి నిర్వహించనున్నట్టు బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. పురుషుల ఐపీఎల్‌ తరహాలో ఈ టోర్నీ కూడా చెరో 20 ఓవర్లు ఉంటుంది. ఈ టోర్నీలోని అన్ని జట్లు 2 సార్లు తలపడతాయి. టేబుల్ టాపర్లు ఫైనల్స్‌కు నేరుగా ప్రవేశం పొందుతారు. కాగా, ఎలిమినేటర్‌లో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య మ్యాచ్ ఉంటుంది. ఒక్కో జట్టు ప్లేయింగ్ XIలో ఐదుగురు కంటే ఎక్కువ విదేశీ క్రికెటర్లు ఉండకూడదు.

ఒక్కో జట్టులో గరిష్టంగా 18 మంది ఆటగాళ్లు..

బీసీసీఐ ప్రకారం, దేశీయ, అంతర్జాతీయ ఆటగాళ్లతో మంచి జట్టును తయారు చేయడానికి ఈ టోర్నమెంట్‌లో మొదటి ఐదు జట్లు ఆడతాయి. ప్రతి జట్టు గరిష్టంగా పద్దెనిమిది మంది ఆటగాళ్లను కలిగి ఉంటుంది. ఈ 18 మంది ఆటగాళ్లలో ఆరుగురికి మించి విదేశీ ఆటగాళ్లు ఉండరు.

ఇవి కూడా చదవండి

విశేషమేమిటంటే, మహిళల బిగ్ బాష్ లీగ్ 2016 సంవత్సరం నుంచి ఆస్ట్రేలియాలో నిర్వహిస్తారు. ఇది కాకుండా, గత సంవత్సరం ఇంగ్లాండ్‌లో మహిళల ది హండ్రెడ్ నిర్వహించారు. వచ్చే ఏడాది నుంచి మహిళల లీగ్‌ను నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా నిర్ణయించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us