IND VS AUS Test Match : రెండో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి..

|

Jan 08, 2021 | 2:10 PM

భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ సిడ్నీ వేదికగా  జరుగుతుంది. 166/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియా  338 పరుగులకు ఆలౌట్ అయ్యింది..

IND VS AUS Test Match : రెండో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి..
Follow us on

IND VS AUS Test Match : భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ సిడ్నీ వేదికగా  జరుగుతుంది. 166/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియా  338 పరుగుల చేసింది. స్పిన్నర్‌ రవీంద్ర జడేజా చెలరేగడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది. జడేజా 4, బుమ్రా, సైని 2, సిరాజ్ 1 వికెట్‌ తీశారు. ఆతర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిలకడగా ఆడుతూ మంచి ప్రదర్శన కనబరిచింది. శుక్రవారం ఆట నిలిచిపోయే సమయానికి భారత్‌ 45 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది.  70 పరుగుల వద్ద రోహిత్ శర్మ (26) పరుగులకు వెనుదిరిగాడు. 85 పరుగుల దగ్గర శుభ్‌మన్‌గిల్ 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో పుజారా (9), రహానే (5) ఉన్నారు. టీమిండియా ఇంకా 242 పరుగుల వెనుకంజలో ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

IND VS AUS Test Match : రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. క్రీజ్‌లో పుజారా, రెహానే