Asia Cup 2025: ఆసియాకప్‌నకు భారత జట్టు ఇదే.. ఆ ఇద్దరికి హ్యాండిచ్చిన బీసీసీఐ..

India Asia Cup 2025 Squad Announcement: ఆసియా కప్ 1984 లో ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ ఇప్పటివరకు 16 సార్లు జరిగింది. భారత జట్టు అత్యధికంగా అంటే 8 సార్లు గెలిచింది. శ్రీలంక ఈ టోర్నమెంట్‌ను 6 సార్లు, పాకిస్తాన్ 2 సార్లు గెలుచుకుంది.

Asia Cup 2025: ఆసియాకప్‌నకు భారత జట్టు ఇదే.. ఆ ఇద్దరికి హ్యాండిచ్చిన బీసీసీఐ..
Asia Cup 2025 India Sqaud

Updated on: Aug 19, 2025 | 3:29 PM

India Asia Cup 2025 Squad Announcement: టీ20 ఆసియా కప్ కోసం భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టును ప్రకటించారు. టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్ కోసం జట్టులో చోటు దక్కించుకున్నాడు. గిల్ సూర్యకుమార్ యాదవ్‌కు డిప్యూటీగా ఎంపికయ్యాడు. కాగా, ఫాంలో ఉన్న శ్రేయాస్ అయ్యర్‌కు మాత్రం మరోసారి బీసీసీఐ సెలెక్టర్లు హ్యాండిచ్చారు.

కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లను స్పిన్నర్లుగా ప్రకటించారు. అభిషేక్ శర్మ, సంజు సామ్సన్‌లను ఓపెనింగ్ బ్యాటర్లుగా బరిలోకి దిగనున్నారు.

ఇవి కూడా చదవండి

భారత జట్టు: సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (కీపర్), హర్షిత్ సింగ్ రాణా.

జట్టు ఎంపిక గురించి 3 ప్రత్యేక విషయాలు..

గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు: భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఎంపికకు ముందు, జట్టులో గిల్ స్థానం గురించి మీడియా నివేదికలలో ప్రస్తావించలేదు. టీ20 ప్రపంచ కప్ కోసం కూడా అతన్ని జట్టులో చేర్చలేదు. అయితే, గిల్ ఐపీఎల్‌లో 650 పరుగులు చేశాడు.

సిరాజ్, వాషింగ్టన్‌లకు అవకాశం రాలేదు: అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్, హర్షిత్ రాణా‌లకు జట్టులో అవకాశం లభించింది. అయితే, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ లకు జట్టులో స్థానం లభించలేదు. యశస్వి జైస్వాల్, సుందర్ జట్టులో రిజర్వ్ ఆటగాళ్ళుగా ఉంటారు.

టీ20 ప్రపంచ కప్ తర్వాత బుమ్రా పునరాగమనం: జస్ప్రీత్ బుమ్రా టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. గత టీ20 అంతర్జాతీయ టీ20 ప్రపంచ కప్ 2024లో ఫైనల్ ఆడాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లిన శ్రేయాస్ అయ్యర్‌ను కూడా జట్టులోకి ఎంపిక చేయలేదు.

ఒకే గ్రూప్‌లో భారత్-పాక్..

ఆసియాకప్‌ 2025లో భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ ఉన్నాయి. గ్రూప్‌లోని అన్ని జట్లు ఒకదానితో ఒకటి 1-1 మ్యాచ్ ఆడతాయి. సెప్టెంబర్ 10న భారత్ యుఎఇతో, 14న పాకిస్థాన్‌తో, 19న ఒమన్‌తో తలపడుతుంది.

భారత్, పాకిస్తాన్ సూపర్-4 దశకు చేరుకుంటే, రెండు జట్లు సెప్టెంబర్ 21న మరోసారి తలపడతాయి. టోర్నమెంట్ ఫైనల్ సెప్టెంబర్ 28న జరుగుతుంది. భారత్, పాకిస్తాన్ సూపర్-4 దశలో అగ్రస్థానంలో ఉంటే, టోర్నమెంట్‌లో ఈ రెండింటి మధ్య 3వ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us