Anushka Sharma: ఓవల్ స్టేడియంలో టీమిండియా క్రికెటర్ల భార్యలు సందడి.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

|

Sep 03, 2021 | 1:19 PM

భారత్-ఇంగ్లాండ్ మధ్య లండన్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్ల భార్యలు సందడి చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Anushka Sharma: ఓవల్ స్టేడియంలో టీమిండియా క్రికెటర్ల భార్యలు సందడి.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
Anushka Sharma poses for pics with Sanjana Ganesan, Pratima Singh and other cricket wives at India vs Eng
Follow us on

భారత్-ఇంగ్లాండ్ మధ్య లండన్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్ల భార్యలు సందడి చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఓవల్ స్టేడియంలో వీరి గ్రూప్ ఫోటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. అనుష్క శర్మతో పాటు బుమ్రా భార్య సంజనా గణేశన్, ఇషాంత్ సింగ్ భార్య ప్రతిమా సింగ్, రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్, మయాంక్ అగర్వాల్ భార్య అషిత సూద్ తదితరులు ఉన్నారు. తమ భర్తలు మైదానంలో క్రికెట్ ఆడుతున్న సమయంలో వీరు గ్యాలరీలో ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. వారి వెంట వారి పిల్లలు కూడా ఉన్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు క్రికెటర్లు, వారు కుటుంబీకులతోనూ అనుష్క శర్మకు మంచి సంబంధాలున్నాయి.

క్రికెటర్ ఇషాంత్ సింగ్ బార్య ప్రతిమా సింగ్ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటో..

Also Read..

బిగ్ బాస్ 5: ఈ ఐదు కంటెస్టెంట్లదే అత్యధిక రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Bullet Bandi Song: పక్షవాతం వచ్చిన రోగికి బుల్లెట్ బండి పాటతో ట్రీట్మెంట్.. వైరల్ వీడియో