AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India : మ్యాచ్ గెలుస్తుందనుకున్న టైంలో భారత జట్టుకు దెబ్బ మీద దెబ్బ

లార్డ్స్ టెస్ట్ నాలుగో రోజున రిషబ్ పంత్ తర్వాత ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్‌కు కూడా గాయమైంది. ఈ గాయాల వల్ల భారత జట్టుకు ఆందోళన పెరిగింది. ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఇద్దరు ముఖ్యమైన ఆటగాళ్లు గాయపడడం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ. ఈ గాయాలు భారత జట్టుపై తీవ్ర ప్రభావం చూపవచ్చు.

Team India : మ్యాచ్ గెలుస్తుందనుకున్న టైంలో భారత జట్టుకు దెబ్బ మీద దెబ్బ
Akash Deep
Rakesh
|

Updated on: Jul 14, 2025 | 1:12 PM

Share

Team India :లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టుకు గాయాల బెడద పెరుగుతోంది. ఇప్పటికే రిషబ్ పంత్ గాయంతో ఇబ్బంది పడుతుండగా, ఇప్పుడు నాలుగో రోజు ఆటలో ఆకాష్ దీప్‎కు కూడా గాయమైంది. ఆకాష్ దీప్ మైదానంలో కుంటుతూ కనిపించాడు. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వెళ్ళాడు. కీలకమైన రోజు ఆకాష్ దీప్ మంచి ఫామ్‎లో ఉన్నాడు. అతను ప్రపంచ నంబర్ 1 బ్యాట్స్‌మెన్ అయిన హ్యారీ బ్రూక్‎ను క్లీన్ బౌల్డ్ చేసి ముఖ్యమైన వికెట్ కూడా పడగొట్టాడు.

రిషబ్ పంత్ గాయంతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న భారత జట్టుకు, మరో ముఖ్యమైన ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ గాయం మరింత ఆందోళన కలిగించింది. ఒక నివేదిక ప్రకారం.. ఆకాష్ దీప్ మైదానంలో కుంటుతూ కనిపించాడు. బౌండరీ దగ్గర టీమ్ ఫిజియోతో మాట్లాడుతున్నప్పుడు కూడా అతను నొప్పితో ఉన్నట్లు కనిపించాడు.

ఆకాష్ దీప్ నాలుగో రోజు మొదటి సెషన్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. హ్యారీ బ్రూక్‌ను అవుట్ చేసి జట్టుకు పెద్ద ఉపశమనం కలిగించాడు. గత ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో 10 వికెట్లు తీసి ఆకాష్ దీప్ భారత జట్టుకు ట్రంప్ కార్డ్‌గా నిరూపించుకున్నాడు. అయితే, అతని గాయం ఎంత తీవ్రమైనదో ఇంకా స్పష్టంగా తెలియలేదు.

ఆకాష్ దీప్ గాయపడడానికి ముందు, రిషబ్ పంత్ కూడా గాయపడ్డాడు. వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు బంతి అతని చేతికి బలంగా తగలడంతో అతను మైదానం నుంచి బయటకు వెళ్ళాడు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు స్వీకరించాడు. పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చినప్పటికీ తన పరిస్థితిని వైద్య బృందం పర్యవేక్షిస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..