AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది విన్నారా..! స్వాతంత్ర్యం తర్వాత టీమిండియా ఆడిన తొలి వన్డే ఎప్పుడు.? ఎవరితోనో తెల్సా

1947, ఆగష్టు 15న భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చింది. ఇక ఇవాళ దేశమంతా 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం బీసీసీఐ క్రికెట్ ప్రపంచానికి పెద్దన్నగా ఏలుతోంది. ప్రపంచంలోనే అత్యంత బలమైన క్రికెట్ జట్లలో ఒకటైన టీమ్ ఇండియా..

ఇది విన్నారా..! స్వాతంత్ర్యం తర్వాత టీమిండియా ఆడిన తొలి వన్డే ఎప్పుడు.? ఎవరితోనో తెల్సా
Team India
Ravi Kiran
|

Updated on: Aug 15, 2024 | 5:03 PM

Share

1947, ఆగష్టు 15న భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చింది. ఇక ఇవాళ దేశమంతా 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం బీసీసీఐ క్రికెట్ ప్రపంచానికి పెద్దన్నగా ఏలుతోంది. ప్రపంచంలోనే అత్యంత బలమైన క్రికెట్ జట్లలో ఒకటైన టీమ్ ఇండియా.. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రెండు వన్డే ప్రపంచకప్‌లు, రెండు టీ20 ప్రపంచకప్‌లు సహా నాలుగు ప్రపంచకప్‌లను గెలుచుకుంది. మరి స్వాతంత్ర్యం తర్వాత టీమ్ ఇండియా ఆడిన తొలి వన్డే ఎప్పుడో.? ఎవరితోనో ఇప్పుడు తెలుసుకుందామా..

తొలి వన్డే ఇంగ్లాండ్‌తో ఆడింది..

నిజానికి 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా, భారత్‌లో క్రికెట్ ఎదగడానికి చాలా సమయం పట్టింది. దీని ప్రకారం, స్వాతంత్ర్యం వచ్చిన సరిగ్గా 27 సంవత్సరాల తరువాత, జూలై 13, 1974న, టీం ఇండియా తన మొదటి వన్డే అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీమ్ ఇండియా మొత్తం 1058 వన్డే మ్యాచ్‌లు ఆడింది. పలు చిరస్మరణీయ విజయాలను కూడా అందుకుంది. అయితే స్వాతంత్య్రానంతరం టీం ఇండియా ఆడిన తొలి వన్డే మ్యాచ్ భారత క్రికెట్‌కు మరిచిపోలేని ఘట్టం. నిజానికి స్వాతంత్య్రానంతరం ఇంగ్లండ్‌తో టీం ఇండియా తొలి వన్డే ఆడింది. ఇంగ్లండ్‌లోని చారిత్రాత్మక లీడ్స్ మైదానంలో జరిగిన 55 ఓవర్ల మ్యాచ్‌లో మైక్ డెన్నెస్ ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించగా, అజిత్ వాడేకర్ భారత జట్టుకు నాయకత్వం వహించాడు.

టీమ్ ఇండియా ప్రదర్శన ఎలా ఉంది?

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ మైక్ డెన్నెస్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీని ప్రకారం తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 55 ఓవర్లు పూర్తిగా ఆడలేక 53.5 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. జట్టుకు ఓపెనర్‌గా వచ్చిన సునీల్ గవాస్కర్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 28 పరుగులు చేశాడు. జట్టులో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన అజిత్ వాడేకర్ 82 బంతుల్లో 10 బౌండరీలతో 67 పరుగులు చేశాడు. తద్వారా ఇంగ్లండ్‌కు ఆ జట్టు 265 పరుగుల స్కోరును నిర్దేశించింది.

ఫలితం ఏమిటి?

భారత్ ఇచ్చిన 266 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్ జట్టు 51.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయ తీరానికి చేరుకుంది. ఇంగ్లండ్‌ తరఫున జాన్‌ ఎడ్రిచ్‌ 90, టోనీ గ్రేడ్‌ 40, కీత్‌ ఫ్లెచర్‌ 39, డేవిడ్‌ లాయిడ్‌ 34 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో జట్టును గెలిపించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఇంగ్లండ్‌కు చెందిన జాన్ ఎడ్రిచ్ ఎంపికయ్యాడు.

భారత్ బౌలింగ్ విఫలమైంది..

టీమ్ ఇండియా బ్యాటింగ్ విభాగం 265 పరుగుల మంచి స్కోరును చేయగలిగింది. కానీ జట్టు బౌలింగ్ బలహీనంగా ఉంది. ఏక్‌నాథ్ లోకర్, బిషప్ సింగ్ బేడీలు చెరో 2 వికెట్లు తీయగా, మదన్ లాల్, శ్రీనివాస్ వెంకటరాఘవన్ చెరో వికెట్ తీశారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..