IND vs AFG 3rd T20I: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బంతుల్లో సెంచరీ..!

భారత క్రికెట్ జట్టు (Team India) ఓపెనర్లు టీ20 సమరంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) కేవలం 30 బంతుల్లోనే 100 పరుగులు బాదేశాడు. 9 ఫోర్లు, 10 సిక్స్‌లతో ఆప్ఘాన్ బౌలర్ల తాట తీశాడు.

IND vs AFG 3rd T20I: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బంతుల్లో సెంచరీ..!
Abhishek Sharma Century

Updated on: Sep 17, 2026 | 8:14 PM

టీ20లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన భారత ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 30 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. 2017లో 35 బంతుల్లో సెంచరీ చేసి రోహిత్ శర్మ నెలకొల్పిన రికార్డును అభిషేక్ బద్దలు కొట్టాడు.

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడవ టీ20లో, భారత్ 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 134 పరుగులు చేసింది.

అభిషేక్ 31 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్లతో 101 పరుగులు చేసి బ్యాటింగ్ చేస్తున్నాడు. సంజు సామ్సన్ 23 బంతుల్లో 33 పరుగులు చేశాడు. భారత్ ఇంతకుముందు పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 100 పరుగులు చేసింది, అదే వారి అత్యధిక పవర్‌ప్లే స్కోరు.

Loading...
Unable to load recommendations.
Follow Us