Viral Video: పంత్‌ను పట్టించుకోని ధోనీ.. పడీపడీ నవ్వుకున్న రోహిత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌

|

Jul 27, 2022 | 6:44 PM

ఇంగ్లండ్‌తో (England) మ్యాచ్ లు అనంతరం టీమిండియా సీనియర్ క్రికెటర్లు రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వారి మధ్య ఫన్నీ కన్వర్జేషన్ జరిగింది. రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మలు ఇన్‌స్టా‍గ్రామ్‌లో లైవ్‌ చాట్‌లో పాల్గొన్నారు. ముగ్గురూ ఒకరిపై...

Viral Video: పంత్‌ను పట్టించుకోని ధోనీ.. పడీపడీ నవ్వుకున్న రోహిత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌
Panth Dhoni
Follow us on

ఇంగ్లండ్‌తో (England) మ్యాచ్ లు అనంతరం టీమిండియా సీనియర్ క్రికెటర్లు రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వారి మధ్య ఫన్నీ కన్వర్జేషన్ జరిగింది. రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మలు ఇన్‌స్టా‍గ్రామ్‌లో లైవ్‌ చాట్‌లో పాల్గొన్నారు. ముగ్గురూ ఒకరిపై మరొకరు జోకులు వేసుకుంటూ సరదాగా గడిపారు. అయితే వీరి లైవ్ కు ధోనీ ఎంటర్ అయ్యారు. దీంతో ముగ్గురూ షాక్ అయ్యారు. వీడియోలో ధోని భార్య సాక్షి సింగ్‌ కూడా కనిపించింది. చివరగా ధోని (MS.Dhoni) వైపు కెమెరా రాగానే.. రోహిత్‌, సూర్యకుమార్‌, పంత్‌లు హాయ్‌ చెప్పారు. ధోని కూడా హాయ్‌ చెప్పాడు. ఇంతలో పంత్‌ (Rishabh Panth).. మహీ భాయ్‌.. మేం లైవ్‌ కాల్‌ ఉన్నాం.. మాతో కాసేపు గడుపు అని కోరాడు. దీనికి ధోని అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంత టైమ్ లేదని కాల్ కట్ చేశాడు. పంత్‌ మాట లెక్కచేయకుండా ధోని కాల్‌ కట్‌ చేయడంతో రోహిత్‌, సూర్య కుమార్‌లు పడీపడీ నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా.. టీమిండియా – వెస్టిండీస్ మధ్య మూడో వన్డే నేడు జరగనుంది. ఇప్పటికే 2-0 తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా మూడో వన్డేలోనూ గెలిచి.. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని తహతహలాడుతోంది. మరోవైపు.. ఎలాగైనా మూడో వన్డేలో గెలిచి పరుపు నిలబెట్టుకోవాలని విండీస్ ప్రణాళికలు రూపొందిస్తోంది. రెండు మ్యాచ్‌లలోనూ గట్టి పోటీ ఇచ్చిన వెస్టిండీస్.. కీలక సమయాల్లో చేసిన తప్పిదాల వల్ల మ్యాచ్ లను కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో ఇరు జట్ల మధ్య జరిగే మూడో వన్డేపై ఆసక్తి నెలకొంది. బ్యాటింగ్‌, బౌలింగ్ లో టీమిండియా జోరు చూపిస్తోంది. సీనియర్లు లేకపోయినప్పటికీ.. యువ ఆటగాళ్లతో దిగ్విజయంగా ముందుకు వెళ్తోంది. బౌలింగ్ విభాగం కూడా బలంగానే ఉండటంతో టీమిండియాకు తిరుగు లేకుండా పోయింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి