
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. విశ్వంలోని ప్రతి వస్తువుకూ ఒక శక్తి ఉంటుంది. మన జీవితాన్ని ప్రభావితం చేసే గ్రహాలకు ఎలాగైతే ప్రత్యేక స్థానం ఉందో, మనం ధరించే రంగులకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. 12 రాశులలో ప్రతిదానికీ ఒక పాలక గ్రహం ఉంటుంది. ఆ గ్రహాల స్వభావాన్ని బట్టి కొన్ని రంగులు మనకు అదృష్టాన్ని ఇస్తే, మరికొన్ని రంగులు ప్రతికూలతను కలిగిస్తాయి. ముఖ్యంగా నలుపు రంగు విషయంలో జ్యోతిష్కులు కొన్ని ఆసక్తికర విషయాలు చెబుతున్నారు. నలుపు అందరికీ సమానంగా శుభప్రదం కాదు. కొన్ని రాశుల వారు నలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల మానసిక ఒత్తిడి, పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
మేష రాశికి అధిపతి కుజుడు. కుజుడు అగ్ని తత్వానికి, శక్తికి ప్రతీక. మేష రాశి వారు నలుపు రంగు దుస్తులను ఎక్కువగా ధరిస్తే, వారిలో మానసిక ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా వృత్తి, వ్యాపార రంగాలలో అనవసరమైన అడ్డంకులు ఎదురుకావచ్చు. ఎరుపు, నారింజ, బంగారం, గులాబీ లేదా క్రీమ్ రంగులు వీరికి సానుకూలతను ఇస్తాయి.
కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనస్సుకు కారకుడు. నలుపు రంగు కర్కాటక రాశి వారి మనస్సులో అస్థిరతను లేదా భావోద్వేగాలను పెంచుతుంది. ఇది వారిని మానసిక ప్రశాంతతకు దూరం చేయవచ్చు. నీలం, పసుపు వంటి ప్రశాంతమైన రంగులు ధరించడం వల్ల వీరు మానసిక సమతుల్యతను పొందుతారు.
కన్యారాశి వారు సహజంగానే చాలా సున్నిత మనస్కులు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వీరు నలుపు రంగును వాడటం వల్ల ఒత్తిడి, నిరాశ, ఆందోళన పెరిగే అవకాశం ఉంది. ముదురు రంగులు వీరిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఆకుపచ్చ, గులాబీ, బంగారు రంగులు వీరికి శాంతిని, అదృష్టాన్ని చేకూరుస్తాయి.
కేవలం ఈ మూడు రాశుల వారే కాకుండా సాధారణంగా నలుపు, ముదురు బూడిద రంగులను ఎక్కువ కాలం ధరించడం వల్ల ఆలోచనల్లో ప్రతికూలత పెరుగుతుందని జ్యోతిష్కులు హెచ్చరిస్తున్నారు. మీ రాశిచక్రం ప్రకారం అనుకూలమైన రంగులను ఎంచుకోవడం వల్ల జీవితంలో అదృష్టం, ఆనందం, సానుకూల శక్తి పెరుగుతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..