
జ్యోతిష్యం ప్రకారం పసుపుకు శుద్ధి చేసే లక్షణాలు ఉన్నాయి. ఇది శరీరం నుంచి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. స్నానపు నీటిలో పసుపును జోడించడం వల్ల అదృష్టం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. పసుపుకి దేవ గురువు బృహస్పతితో, అంటే నవ గ్రహాల్లో గురువు తో సంబంధం కలిగి ఉంటుంది. కనుక పసుపుతో స్నానం చేయడం జాతకంలో బృహస్పతిని బలపరుస్తుంది. మీ జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉంటే, పసుపు నీటితో స్నానం చేయడం వల్ల బృహస్పతి దోషాలు తొలగిపోతాయని చెబుతారు.
సనాతన ధర్మం విశ్వాసం ప్రకారం.. స్నానపు నీటిలో పసుపు కలపడం వల్ల ఆర్థిక లాభాలు, ఆనందం , శాంతి లభిస్తాయి. వ్యక్తికి విజయం లభిస్తుంది. జ్యోతిషశాస్త్రంలో పసుపు నీటితో స్నానం చేయడం అదృష్టానికి ద్వారాలు తెరవడంతో పాటు అనేక ప్రయోజనాలు కలిగిస్తుందని నమ్మకం.
గురువారం నాడు పసుపుతో స్నానం చేయడం వల్ల వివాహ అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. అంతేకాదు త్వరగా వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. పసుపును శుభప్రదంగా, పవిత్రంగా భావిస్తారు. కనుక పసుపు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల ఇంటికి శ్రేయస్సు, ఆనందం కలుగుతుంది.
ఒక బకెట్ నీటిలో చిటికెడు పసుపు పొడి వేసి.. ఆ పసుపును బాగా కలిపి ఆ నీటితో స్నానం చేయండి. ముఖ్యంగా గురువారం ఈ పసుపు నీటి స్నానం ఒక పరిహారం అని చెబుతున్నారు. అంతేకాదు గురువారం పసుపు నీటితో స్నానం చేస్తే.. స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా పసుపు రంగు దుస్తులు ధరించండి. ఇలా చేయడం వలన శ్రీ మహా విష్ణువు అనుగ్రహంతో పాటు.. గురు దోషం తొలగిపోతుందని విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.