Tirumala: టీటీడీ కీలక నిర్ణయం తిరుమల కొండపై గదుల రిజిస్ట్రేషన్ కోసం 6 చోట్ల కేంద్రాలు..

కొండపై గదుల కేటాయింపులను మరింత సులభతరం చేసింది టీటీడీ. గదుల కేటాయింపును మరింత సులభతరం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం

Tirumala:  టీటీడీ కీలక నిర్ణయం తిరుమల కొండపై గదుల రిజిస్ట్రేషన్ కోసం 6 చోట్ల కేంద్రాలు..
Tirumala Temple

Updated on: Jun 10, 2021 | 10:33 PM

తిరుమల భక్తులకు శుభవార.. కొండపై గదుల కేటాయింపులను మరింత సులభతరం చేసింది టీటీడీ. గదుల కేటాయింపును మరింత సులభతరం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం చుట్టింది. తిరుమలలో అద్దె గదుల కోసం సాధారణ భక్తులకు ఇక్కట్లు తప్పనున్నాయి. సాధారణ భక్తులకు గదుల కేటాయింపునకు ఆరు చోట్ల రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

ఇందులో జీఎన్‌సీ, బాలాజీ బస్టాండ్‌, కౌస్తుభం, రామ్‌ భగీచ, ఎంబీసీ, సీఆర్‌వో వద్ద రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నవారికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా గదుల సమాచారం అందించనున్నారు. ఎస్‌ఎంఎస్‌ వచ్చిన వెంటనే భక్తులు నగదు చెల్లించి గది పొందేలా ఏర్పాటు చేశారు. టీటీడీ ఈ నెల 12న ఉదయం 8 గంటలకు ఈ రిజిస్ట్రేషన్ కేంద్రాలను ప్రారంభించనుంది. శనివారం ఉదయం 8గంటలకు రిజిస్ట్రేషన్‌ కేంద్రాలను టీటీడీ అధికారులు ప్రారంభించనున్నారు.

ఇవి కూడా చదవండి : Surya Grahan 2021: రింగ్ ఆఫ్ ఫైర్ అద్భుతం.. వివిధ దేశాల్లోని కనిపించిన సూర్యగ్రహణం ఇలా..

క‌రోనా క‌ల్లోలంలోనూ క్షుద్రపూజలు.. అర్ధరాత్రి దాటితే జనం వణుకు.. అనుమానాస్పద స్థితిలో యువకుడు అదృశ్యం.!

Loading...
Unable to load recommendations.
Follow Us