Vishnu Sahasranama: ఆర్ధిక ఇబ్బందులను తొలగించే.. విష్ణు సహస్రనామం విశిష్టత

|

Jun 27, 2021 | 6:36 AM

Vishnu Sahasranama: విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత ... మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు..

Vishnu Sahasranama: ఆర్ధిక ఇబ్బందులను తొలగించే..  విష్ణు సహస్రనామం విశిష్టత
Vishnu
Follow us on

Vishnu Sahasranama: విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత … మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు. విష్ణు సహస్రనామము అనగా వేయి పేర్లు అని కాదు అనంతం అని అర్ధం. మొదటిగా విష్ణు సహస్ర నామ స్తోత్రము మహాభారతం లోని అనుశాసనిక పర్వంలో 149వ అధ్యాయంలో ఉంది. అయితే ఆర్ధిక ఇబ్బందులను దూరం చేయాలన్నా.. పిల్లలు మనమాట వినాలన్నా.. విష్ణు సహస్రనామం చదివితే మంచి ఫలితం దక్కుంటుంది.

సమస్త మానవాళి ఉద్ధరింపబడడానికి వచ్చినది విష్ణు సహస్రనామము. ఇది అందరూ చేయవచ్చు. నామము అందరూ చెప్పవచ్చు.మంత్రజపం చేసేవారు స్థాణువులాగా ఉండి చేయాలి. కానీ నామం మాత్రం అటూ ఇటూ తిరుగుతూ, నిలబడి, కూర్చొని, పనిచేసుకుంటూ చేయవచ్చు.నని పండితులు చెప్పారు. స్వప్న, సుషుప్తులకు అధిదేవత పరమశివుడు. అందుకని రాత్రి నిద్రపోయేముందు మూడు మార్లు శివనామం చెప్పి పడుకోవాలి. జాగృతికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. అందువల్ల ఉదయం లేస్తూనే శ్రీహరీ శ్రీహరీ శ్రీహరీ అంటూ లేవాలి.

శాస్త్రంలో మంచంమీద పడుకొని ఏది చేయడాన్నీ అంగీకరించదు. అయితే విష్ణు సహస్రనామానికి ఆ నిబంధన లేదు.
ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదికి రక్షణ కల్పించింది శ్రీమహావిష్ణువు ప్రార్థన. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మంచంమీద ఔషధం కూడా సేవించకూడదు. గజేంద్ర మోక్షం ఉదయం లేవగానే ఎవరు భావన చేస్తారో దుస్స్వప్న ఫలితాలు తొలగిపోతాయి.
కానీ మంచంమీద నుంచి లేస్తూనే విష్ణు సహస్రనామం చదవాలని ఉంటే చక్కగా చదువుకోవచ్చు. నిబంధనలు లేవు.

దుఃస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనమ్!
కాననే నారసింహం చ పావకే జల శాయినమ్!!

విష్ణు సహస్ర నామాన్ని ఎవరు పట్టుకుంటారో ఇహమునందు రక్షణ. పరమునందు పరమేశ్వరుని చేరుకొనే మార్గము సుగమం అవుతుంది. శంకరులకు ఒకసారి సరస్వతీదేవి సాక్షాత్కరించి. కలి ఉద్ధతి పెరిగిపోయిన రోజులలో లోకాన్ని రక్షించగలిగిన అద్భుతమైన సహస్రనామ స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రమే. అది సంజీవనీ ఓషధి వంటిది. కనుక నీవు దీనికి భాష్యం వ్రాయాలి. అని పలికింది. దీంతో ఆదిశంకరులు విష్ణు సహస్రనామానికి భాష్యం చెప్పారు. ఆతరువాత ఉత్తరభారతదేశంలో దానిని రామస్వామి వారు వ్రాశారు.
భీష్మాచార్యుల అనుశాసనమే విష్ణు సహస్రనామ స్తోత్రం.

ఆచార్యుడైన భీష్ముడు చెప్తుండగా ఆచార్యులకే ఆచార్యుడైన శ్రీకృష్ణు పరమాత్మ వింటూండగా వచ్చి, మరొక గురువైన శంకర భగవత్పాదులచే భాష్యాన్ని పొంది విష్ణు సహస్రనామం త్రివేణీ సంగమం అయింది. విష్ణు సహస్రనామం చదవడం అంటే పరమేశ్వరుని చేరుకొనే మార్గంలో ప్రయాణం చేయడం. భగవంతునికి సహస్ర నామాలతో పూజ చేయాలి. కుదరని పక్షంలో 108 నామాలతో చేయాలి.
108 రక్షణ హేతువు. గురువుకు 116 పేర్లతో పూజ చేయాలి. లోకంలో ఏప్రాణియైనా 27 నక్షత్రములలో పుడుతుంది. ఒక్కొక్క దానికి నాలుగు పాదాలు. 27 X 4 = 108. పూజకు సమయంలేనప్పుడు..
కేశవ, మాధవ, నారాయణ, గోవింద, మధుసూదన, విష్ణు, త్రివిక్రమ., వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర అనే ఈ పన్నెండు నామాలతో చేస్తే పూర్తి అవుతుంది. అలా అని ఆలస్యంగా లేవమని కాదు. ఈ నామాలు చెప్తూ విష్ణు భక్తులు ఊర్ధ్వపుండ్రములను ధరిస్తారు.

Also Read: నిమ్మచెట్టుతో శివలింగం చేసి ధర్మరాజు ప్రతిష్టించిన ఆలయం రూపాల సంగమేశ్వర స్వామి దేవాలయం ఎక్కడంటే