
రథ సప్తమి అంటే అది మన జీవిత రథాన్ని సరైన మార్గంలో నడిపించుకోవడానికి చేసే సంకల్పం. సూర్యుడు ఆరోగ్యానికి ఆత్మవిశ్వాసానికి కారకుడు. అందుకే ఈ రోజు చేసే దానాలు కేవలం ఆధ్యాత్మిక ఫలితాలే కాకుండా, మానసిక ప్రశాంతతను కూడా ఇస్తాయి. జ్యోతిష్య నిపుణుల అంచనా ప్రకారం, ఆయా రాశుల వారు సూర్యుడికి ఇష్టమైన వస్తువులను దానం చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. మరి మీ రాశి ప్రకారం మీరు ఏం దానం చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.
మేష రాశి: ఎర్రటి వస్త్రం, శనగలు బెల్లం దానం చేయడం వల్ల పనుల్లో స్థిరత్వం వస్తుంది.
వృషభ రాశి: బియ్యం, పాలు, చక్కెర లేదా తెల్ల నువ్వులు దానం చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
మిథున రాశి: ఆకుపచ్చని దుస్తులు లేదా పెసరపప్పు దానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.
కర్కాటక రాశి: పాలు తెల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
సింహ రాశి: అధిపతి సూర్యుడే కాబట్టి గోధుమలు, బెల్లం దానం చేయడం వల్ల సామాజిక గౌరవం పెరుగుతుంది.
కన్య రాశి: ఆకుపచ్చ కూరగాయలు లేదా పప్పు ధాన్యాలను దానం చేస్తే ఆరోగ్యానికి మంచిది.
తులా రాశి: బియ్యం, చక్కెర దానం చేయడం వల్ల జీవితంలో విలాసవంతమైన సౌకర్యాలు పెరుగుతాయి.
వృశ్చిక రాశి: ఎరుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం, శత్రు జయం లభిస్తాయి.
ధనుస్సు రాశి: పసుపు రంగు వస్త్రాలు లేదా పప్పు ధాన్యాలు దానం చేస్తే జ్ఞానం, శ్రేయస్సు కలుగుతాయి.
మకరం, కుంభం: నల్ల నువ్వులు లేదా ఇనుప వస్తువుల దానం వల్ల శని ప్రభావం తగ్గి సూర్య శక్తి లభిస్తుంది.
మీన రాశి: పసుపు పండ్లు లేదా పసుపు రంగు దుస్తుల దానం వల్ల ఆధ్యాత్మిక ఉన్నతి పొందుతారు.
రథ సప్తమి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి, సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం శ్రేయస్కరం. పైన పేర్కొన్న దానధర్మాలు మీ శక్తి కొలది చేయడం వల్ల మీ జీవితం సుఖసంతోషాలతో నిండుతుంది. ఈ శుభ సమయంలో చేసే భక్తి పూర్వక పనులు మీ జీవిత దిశను మార్చగలవు.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. ఈ వివరాలు జ్యోతిష్య శాస్త్ర నమ్మకాలపై ఆధారపడి ఉన్నాయి, దీనికి శాస్త్రీయ ఆధారం లేదు. దీనికి సంబంధించి ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం. సంస్థ దీనికి బాధ్యత వహించదు.