Anandeshwara Temple: ఇక్కడ శివలింగాన్ని కర్ణుడు పూజించి అదృశ్యమయ్యేవాడట.. మహాభారత కాలం నాటి ఆలయం ఎక్కడుందంటే..

|

Jul 10, 2023 | 10:14 AM

ఈ ఆలయంలో మహాదేవుని పేరు వెనుక ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ శివయ్యను బాబా ఆనందేశ్వర అని పిలుస్తారు. మహాభారత కాలంలో కర్ణుడు గంగానదిలో స్నానం చేసిన తర్వాత ఇక్కడ మహాదేవుని పూజించేవాడు. అలా పూజ చేసిన తర్వాత కర్ణుడు అదృశ్యమయ్యేవాడట. అనంతరం ఆనంది అనే ఆవు గడ్డి మేయడానికి వచ్చేది.

Anandeshwara Temple: ఇక్కడ శివలింగాన్ని కర్ణుడు పూజించి అదృశ్యమయ్యేవాడట.. మహాభారత కాలం నాటి ఆలయం ఎక్కడుందంటే..
Anandeshwara Temple
Follow us on

భారత దేశం ఆధ్యాత్మిక ప్రదేశము.. అనేక ఆలయాలు ఎన్నో రహస్యాలను నింపుకుని ఉన్నాయి. కొన్ని ఆలయాలు యుగయుగాలుగా పూజలను అందుకుంటున్నాయని విశ్వాసం. అలాంటి ఒక ఆలయం ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాలోని గంగానది ఒడ్డున పరమత్ ఘాట్ వద్ద ఉన్న ఆనందేశ్వర మహాదేవ దర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు. ఈ ఆలయం మహాభారత కాలం నాటిదని ఆనందేశ్వర మహాదేవుడిని దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.

ఈ ఆలయంలో మహాదేవుని పేరు వెనుక ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ శివయ్యను బాబా ఆనందేశ్వర అని పిలుస్తారు. మహాభారత కాలంలో కర్ణుడు గంగానదిలో స్నానం చేసిన తర్వాత ఇక్కడ మహాదేవుని పూజించేవాడు. అలా పూజ చేసిన తర్వాత కర్ణుడు అదృశ్యమయ్యేవాడట. అనంతరం ఆనంది అనే ఆవు గడ్డి మేయడానికి వచ్చేది.

ఆ ఆవు అక్కడ కర్ణుడిని పూజించడం చూసింది. అప్పుడు ఆ ఆవు శివలింగ రూపంలో ఉన్న రాయి దగ్గరకు చేరుకున్నప్పుడు.. దాని పాలు స్వయంచాలకంగా శివలింగంపైకి  చేరుకున్నాయి. అయితే మొదట ఆవు యజమాని గోవుల కాపరి చాలా కలత చెందాడు. చాలా రోజులుగా ఈ దృశ్యాన్ని మౌనంగా చూస్తున్న గొర్రెల కాపరి  అది శివలింగమని గ్రహించాడు. గొర్రెల కాపరి అక్కడ తవ్వి చూడగా అప్పుడు శివలింగం కనిపించింది.  అప్పటి నుండి ఆనందేశ్వర బాబా అని పేరు పెట్టాడు.

ఇవి కూడా చదవండి

కాశీ తరహాలో ఇక్కడ కారిడార్‌ నిర్మాణం 
శివయ్య భక్తుల గురించి చెప్పాలంటే, కాన్పూర్‌లో నివసించే ప్రతి ఒక్కరూ ఆయన భక్తులే. భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని కాశీ తరహాలో ఇక్కడ కూడా కారిడార్‌ను నిర్మిస్తున్నారు. ఆలయంలో.. బాబా ఆనందేశ్వర ఆలయం నిర్మల గంగ ప్రవహిస్తుంది. గంగ నదికి శివుడికి మధ్యలో భారీ నంది ఉంటుంది.  ఈ ఆలయ ప్రాంగణంలో గణేశుడు, సూర్య దేవుడు, హనుమంతుడు, శ్రీ మహా విష్ణువు, రాముని ఆస్థానం, వైభవ లక్ష్మి, దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.

భక్తులు దీనిని ఛోటీ కాశీ అని కూడా పిలుస్తారు
రాష్ట్రంలోనే కాకుండా దేశం నలుమూలల నుండి ఆనందేశ్వర మహాదేవుడు దర్శనం కోసం భక్తులు ఇక్కడికి  వస్తారు. దీనిని ఛోటీ కాశీ అని పిలుస్తారు. రుద్రాభిషేకం, జలాభిషేకం, దుగ్ధాభిషేకంతో పాటు ఛప్పన్ భోగ్ తదితర కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).