మహా కుంభ మేళా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన, ఆధ్యాత్మిక కార్యక్రమం. ఈసారి ఈ మహా కుంభ మేళా 13 జనవరి 2025 నుంచి ప్రయాగ్రాజ్లో జరగబోతోంది. ఈ మహా కుంభ మేళాలో ప్రపంచం నలుమూలల నుంచి సాధువులు, భక్తులు విశ్వాసంలో మునిగిపోతారు. ఈ మహా కుంభ మేళాలో ఆరు రాజ స్నానాలు జరగానున్నాయి. మహా కుంభ మేళాలోని మొదటి రాజ స్నానం 13 జనవరి 2025న జరుగుతుంది. ఈ రోజు పుష్య మాసం పౌర్ణమి. అందుకే మొదటి రోజు రాజ స్నానాన్ని పుష్య మాసం పౌర్ణమి స్నానం అని కూడా అంటారు.
పంచాంగం ప్రకారం నూతన సంవత్సరంలో పుష్య మాసం పూర్ణిమ తిధి జనవరి 13, 2025 ఉదయం 5.03 గంటలకు ప్రారంభమై జనవరి 14, 2025 తెల్లవారుజామున 3.56 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో పౌర్ణమి తిధి జనవరి 13 సోమవారం జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఈ రోజున పుష్య మాసం పూర్ణిమ స్నానం కూడా చేస్తారు. మత విశ్వాసాల ప్రకారం.. ఈ రోజున చేసే రాజ స్నానానికి బ్రహ్మ ముహూర్తం ఉదయం 5.27 నుంచి 6.21 వరకు ఉంది.
సనాతన ధర్మంలో పుష్య పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గంగ నదితో సహా పవిత్ర నదులలో స్నానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. ఈ రోజున దానధర్మాలు కూడా చేస్తారు. విశ్వాసాల ప్రకారం ఈ రోజున చేసే దానధర్మాలు వల్ల అనేక జన్మల పాపాలు తొలగిపోతాయి. ఎంతో పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. ఈ రోజున లోక రక్షకుడైన శ్రీ మహా విష్ణువు ఆశీస్సులు దానధర్మాలు చేసే వారిపై కురుస్తాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.