
గరుడ పురాణం ప్రకారం.. వ్యక్తి మరణించిన తర్వాత 13 రోజుల పాటు గరుడ పురాణం చదవడం ద్వారా ఆత్మకు శాంతి కలుగుతుందని నమ్ముతారు. గరుడ పురాణం పఠించడానికి శుభ్రమైన దుస్తులు ధరించడం, ఏకాగ్రతతో ఉండటం వంటి నియమాలు పాటించాలి. దీనివల్ల భయాలను తొలగించుకొని జీవిత సత్యాన్ని గ్రహించవచ్చు. అంతేకాకుండా మరణానికి ముందు వ్యక్తికి కనిపించే కొన్ని సూచనల గురించి కూడా ఇందులో వివరించబడింది. ఈ సూచనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గరుడ పురాణంలో మరణం సమీపంలో ఉన్న వ్యక్తికి అతని పితృ దేవతలు కనిపిస్తారని చెప్పబడింది. పితృ దేవతలను చూడటం మరణం దగ్గరలో ఉందనడానికి ఒక సంకేతంగా పరిగణించబడుతుంది. ఇది పూర్వీకులతో అనుసంధానాన్ని సూచిస్తుంది.
వ్యక్తి మరణించే ముందు కొన్ని అశుభ సంకేతాలు కనిపిస్తాయని గరుడ పురాణం చెబుతుంది. వాటిలో ముఖ్యమైనది నీడ కనిపించకపోవడం. నూనె, నెయ్యి, నీరు లేదా అద్దంలో తమ నీడను చూడలేకపోవడం మరణానికి సూచనగా భావిస్తారు.
మరణానికి కొన్ని క్షణాల ముందు వ్యక్తికి ఒక రహస్యమైన ద్వారం కనిపిస్తుందట. గరుడ పురాణం ప్రకారం ఆ ద్వారం నుండి ప్రకాశవంతమైన తెల్లటి కాంతి కిరణాలు వస్తాయి. ఇది మరణానికి చేరువలో ఉన్నట్లు సూచిస్తుంది.
గరుడ పురాణం ప్రకారం మరణానికి కొంత సమయం ముందు వ్యక్తి యమదూతలను చూస్తాడు. యమదూతలను చూడటం అంటే మరణం ఆసన్నమైందని అర్థం.
ఎవరైనా మరణించిన తర్వాత గరుడ పురాణాన్ని పఠిస్తారు. మరణించిన వ్యక్తి ఆత్మ 13 రోజుల పాటు ఇంట్లోనే ఉంటుందని నమ్ముతారు. అందుకే గరుడ పురాణం పఠించడం వల్ల ఆత్మకు శాంతి కలుగుతుంది.
ఈ నియమాలను పాటించడం వల్ల గరుడ పురాణం ఫలాన్ని పొందవచ్చు. గరుడ పురాణం మరణం గురించి మనకున్న భయాలను తొలగించి జీవితపు సత్యాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది.