
ఇస్లాం పవిత్ర మాసమైన రంజాన్ ముగియబోతోంది. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఈద్-ఉల్-ఫితర్ ఏప్రిల్ 10వ తేదీ బుధవారం, కొన్ని దేశాల్లో ఏప్రిల్ 11వ తేదీ గురువారం జరుపుకోనున్నారు. ఈద్ సందర్భంగా ఖీర్ తినక పోతే ఈ పండుగ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఈద్-ఉల్-ఫితర్ రోజున ఖీర్ తినే తినాలనే ఆచారం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. అయితే ఖీర్ లేని ఈద్ పండుగ ఎందుకు అసంపూర్తిగా ఉంటుంది? ఈ సంప్రదాయం ఎలా ప్రారంభమైందో ఈ రోజు తెలుసుకుందాం..
ఈద్ ఉల్ ఫితర్ ఇస్లామిక్ మతంలోని అతి ముఖ్యమైన పండుగ. ఇది రంజాన్ నెల ముగింపును సూచిస్తుంది. ఈ పండుగలో సేమ్యాకు చాలా ప్రాముఖ్యత ఉంది. సేమ్యా లేదా ఖీర్ పాలలో చేసే స్వీట్. ముస్లిం సంస్కృతిలో ఇది చాలా ముఖ్యమైనది. ఈద్ రోజున చేసిన ఖీర్ ని ఇంట్లో కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంచుతారు. ఇది పండుగ ఆనందాన్ని పెంచుతుంది. ఈద్ ఉల్ ఫితర్ నుంచే సేమ్యాను తయారు చేసే ఈ సంప్రదాయం ప్రారంభమైంది. ఈ స్వీట్ని ముస్లింలు షీర్ ఖుర్మా అంటారు.
పర్షియన్ భాషలో షీర్ అంటే పాలు.. ఖుర్మా అంటే ఖర్జూరం. ఇది భారతదేశంలోని దాదాపు ప్రతి ముస్లిం ఇంట్లో తయారయ్యే వంటకం. ఈద్ రోజున ఖీర్ ని తిని ఒకరినొకరు కౌగిలించుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
ఖీర్ తినే సంప్రదాయం ఎలా వచ్చిందంటే
ఇస్లాం మతంలో ఈద్ జరుపుకోవడానికి రెండు ప్రధాన కారణాలు పేర్కొన్నాయి. మొదటిది-ఎ-బాదర్ యుద్ధంలో ముస్లింలు మొదటి విజయం సాధించారు. ఈ యుద్ధం 2 హిజ్రీ 17 రంజాన్ రోజున జరిగింది. ఇది ఇస్లాల మొదటి యుద్ధం. ఈ యుద్ధంలో 313 మంది నిరాయుధ ముస్లింలు ఉండగా.. మరోవైపు కత్తులు , ఆయుధాలు ఉన్న శత్రు దళాల సంఖ్య 1000 కంటే ఎక్కువ. ఈ యుద్ధంలో ముస్లింలు ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాయకత్వంలో చాలా ధైర్యంగా పోరాడి విజయం సాధించారు.
ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకుని సేమ్యాతో చేసిన ఖీర్ ను పంచిపెట్టి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అప్పటి నుంచి ఈద్ సందర్భంగా ఖీర్ తినే సంప్రదాయం కొనసాగుతోంది. అందువల్ల ఈద్ పండుగ ఖీర్ లేకుండా అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఈద్ జరుపుకోవడానికి రెండవ ప్రధాన కారణం ముస్లింలు 30 రోజులు ఉపవాసం ఉంటారు. రాత్రి ప్రార్థనలు చేస్తారు. అటువంటి పరిస్థితిలో అల్లా నుంచి లభించిన ప్రతిఫలంగా ముస్లింలు ఈద్ రోజున మంచి వంటకాలు, ఖీర్ ను తయారుచేస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..