AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శనివారం ఇలా చేస్తే.. శని దేవుడి అనుగ్రహం.. సుఖ-సంతోషాల జీవితం ఖాయం..!

Saturday remedies: శని ప్రభావం తగ్గి, ఆయన అనుగ్రహం పొందాలంటే శనివారం కొన్ని ఆచరణలు చేయడం మంచిది. శనివారం రోజున శని ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయడం శ్రేయస్కరం. నెయ్యితో దీపం వెలిగించి, నల్ల నువ్వులు సమర్పించడం శుభప్రదం అని చెబుతారు. అలాగే శని మంత్రం లేదా గాయత్రి మంత్రం జపించడం ద్వారా శని దోష ప్రభావం తగ్గుతుందని నమ్మకం.

శనివారం ఇలా చేస్తే.. శని దేవుడి అనుగ్రహం.. సుఖ-సంతోషాల జీవితం ఖాయం..!
Shani Dev blessings
Rajashekher G
|

Updated on: Feb 13, 2026 | 5:29 PM

Share

హిందూ మతంలో శని దేవుడికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రతి ఒక్కరూ కూడా శని దేవుడు అనుగ్రహం కలిగి సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటారు. శని దేవుడు కర్మఫలదాతగా ప్రసిద్ధి. ఆయన కటాక్షం ఉంటే జీవితం స్థిరంగా, శ్రేయస్సుతో సాగుతుందని నమ్మకం. అయితే జాతకంలో శని ప్రభావం ప్రతికూలంగా ఉంటే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగం లేదా వ్యాపారంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్వసిస్తారు. అందుకే శని ప్రభావం తగ్గి, ఆయన అనుగ్రహం పొందాలంటే శనివారం కొన్ని ఆచరణలు చేయడం మంచిదని భావిస్తారు.

శనివారం చేయవలసిన ఆచరణలు

శనివారం రోజున శని ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయడం శ్రేయస్కరం. నెయ్యితో దీపం వెలిగించి, నల్ల నువ్వులు సమర్పించడం శుభప్రదం అని చెబుతారు. అలాగే శని మంత్రం లేదా గాయత్రి మంత్రం జపించడం ద్వారా శని దోష ప్రభావం తగ్గుతుందని నమ్మకం.

శనివారం దానం ప్రాముఖ్యం

శనివారం రోజున ఆహారం, వస్త్రాలు, ధనం వంటి వాటిని దానం చేయడం పుణ్యకరమైనది. ముఖ్యంగా నల్ల దుస్తులు, శనగపిండి, నువ్వులు, నెయ్యి వంటి వస్తువులను అవసరమైన వారికి అందించడం ద్వారా శని అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు.

శివుడు, హనుమంతుడు ఆరాధన

శని ప్రభావం తగ్గాలంటే శివుడు, హనుమంతుడు ఆరాధన చేయడం మంచిదని పండితులు సూచిస్తారు. శివలింగానికి బిల్వపత్రాలతో అర్చన చేసి, ఆవుపాలను సమర్పించడం శుభప్రదం. శనివారం రోజున హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేయడం ద్వారా మనసుకు ప్రశాంతత కలిగి, శని ప్రభావం శాంతిస్తుందని విశ్వాసం.

శనివారం కాకులకు అన్నం, పప్పు పెట్టడం శుభకరంగా భావిస్తారు. ఆలయంలో నవగ్రహ పూజలు చేయించడం మంచిది. ఉదయం త్వరగా లేచి స్నానం చేసి ఉపవాసం ఉండడం ద్వారా ఆత్మశుద్ధి కలుగుతుందని అంటారు. “ఓం శనైశ్చరాయ నమః” మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మానసిక ప్రశాంతత, ధైర్యం లభిస్తాయని విశ్వసిస్తారు. ఈ సమాచారం ఆధ్యాత్మిక విశ్వాసాల ఆధారంగా అందించబడింది. వ్యక్తిగత జాతక పరిస్థితులకు అనుగుణంగా నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని సంస్థ ధృవీకరించదు.)

కెమెరాకు చిక్కిన అరుదైన దృశ్యం,భద్రా రిజర్వ్‌లో అరుదైన జంట దర్శనం
కెమెరాకు చిక్కిన అరుదైన దృశ్యం,భద్రా రిజర్వ్‌లో అరుదైన జంట దర్శనం
భారత్ వరల్డ్ కప్ గెలవడం పక్కా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన జింబాబ్వే
భారత్ వరల్డ్ కప్ గెలవడం పక్కా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన జింబాబ్వే
నిఖిల్ స్వయంభు సినిమాపై అంచనాలు పెంచేసిన టీజర్
నిఖిల్ స్వయంభు సినిమాపై అంచనాలు పెంచేసిన టీజర్
శనివారం ఇలా చేస్తే.. సుఖ-సంతోషాల జీవితం ఖాయం..!
శనివారం ఇలా చేస్తే.. సుఖ-సంతోషాల జీవితం ఖాయం..!
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్.. ఏమన్నారంటే..?
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్.. ఏమన్నారంటే..?
ఈ ఒక్క స్టాక్‌ ఉంటే ఉద్యోగంతో పన్లేదిక.. అప్పుడు రూ. 44.. ఇప్పుడు
ఈ ఒక్క స్టాక్‌ ఉంటే ఉద్యోగంతో పన్లేదిక.. అప్పుడు రూ. 44.. ఇప్పుడు
కొత్త కాంబినేషన్లు కోరుకుంటున్న కుర్రోళ్ళు
కొత్త కాంబినేషన్లు కోరుకుంటున్న కుర్రోళ్ళు
బాలీవుడ్ కోటలో సౌత్ జెండా..! అక్కడ కూడా మనోళ్లదే డామినేషన్..
బాలీవుడ్ కోటలో సౌత్ జెండా..! అక్కడ కూడా మనోళ్లదే డామినేషన్..
కొత్తగూడెంలో కొత్త ట్విస్ట్.. కాంగ్రెస్ - సీపీఐ హోరాహోరీ..
కొత్తగూడెంలో కొత్త ట్విస్ట్.. కాంగ్రెస్ - సీపీఐ హోరాహోరీ..
చాణక్య నీతి: ఈ తప్పులు చేస్తే.. కుటుంబంలో కల్లోలం తప్పదు..!
చాణక్య నీతి: ఈ తప్పులు చేస్తే.. కుటుంబంలో కల్లోలం తప్పదు..!