AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబూదాబీలో BAPS హిందూ మందిరానికి రెండేళ్లు.. 40 లక్షల మంది సందర్శకులు!

అబుదాబీలోని BAPS హిందూ మందిరం రెండేళ్ల వేడుకలు ఘనంగా జరిగాయి. ఇప్పటివరకు 100కి పైగా దేశాల నుంచి 40 లక్షల మంది దర్శనం చేసుకోవడం విశేషం. ఈ మందిరం భక్తి కేంద్రంగా మాత్రమే కాకుండా సాంస్కృతిక సమరసత, ప్రపంచ సౌహార్దానికి ప్రతీకగా నిలుస్తోందని నిర్వాహకులు తెలిపారు.

అబూదాబీలో BAPS హిందూ మందిరానికి రెండేళ్లు.. 40 లక్షల మంది సందర్శకులు!
BAPS Hindu Mandir
Ram Naramaneni
|

Updated on: Feb 16, 2026 | 12:41 PM

Share

అబూదాబీలోని BAPS హిందూ మందిరం మరో మైలురాయిని చేరుకుంది. 14 ఫిబ్రవరి 2026 నాటికి ఈ దివ్యక్షేత్రం తన స్థాపనకు రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ రెండు సంవత్సరాల్లోనే ఇది కేవలం పూజా స్థలం మాత్రమే కాకుండా.. ఆధ్యాత్మిక సేవ, సాంస్కృతిక సమరసత, గ్లోబల్ సౌహార్దానికి ఒక వెలుగుదీపంలా నిలిచింది. పరమపూజ్య మహంత్ స్వామి మహారాజ్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ మందిరాన్ని ఇప్పటివరకు 100కు పైగా దేశాల నుంచి 40 లక్షల (4 మిలియన్) మంది సందర్శించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ మందిరానికి ఏర్పడిన ఆదరణను చాటుతోంది.

వార్షికోత్సవ వేడుకల్లో 8 వేల మందికి పైగా..

రెండేళ్ల పూర్తి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 8,000కు పైగా భక్తులు, ప్రముఖులు, రాజనయికులు, కుటుంబాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి “మందిరం: మన కుటుంబం, మన భవిష్యత్” అనే థీమ్‌ను ఎంచుకున్నారు. అంటే.. మందిరం అనేది కేవలం ప్రార్థన స్థలం కాదు, కుటుంబాలను బలోపేతం చేసే కేంద్రం అనే సందేశాన్ని ఇది హైలైట్ చేసింది.

మహంత్ స్వామి మహారాజ్ ప్రతినిధిగా స్వామి బ్రహ్మవిహారీదాస్‌జీ ముఖ్య ప్రసంగం చేశారు. “ఒక పిల్లవాడు ఏడాదిలో నడవడం నేర్చుకుంటాడు. కానీ రెండేళ్లకు మాట్లాడడం మొదలుపెడతాడు. అలాగే ఈ మందిరం కూడా ఇప్పుడు ప్రపంచంతో మాట్లాడటం ప్రారంభించింది. ఆ సందేశం.. సదభావం” అని ఆయన చెప్పారు.

షేక్ నహ్యాన్ బిన్ ముబారక్‌కు ఘన సత్కారం

ఈ సందర్భంగా యూఏఈలో సాంస్కృతిక సమరసత, ఐక్యతకు మద్దతుగా నిలిచిన షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్‌ను ప్రత్యేకంగా సత్కరించారు. ఆయన ఈ మందిరాన్ని.. “సామూహిక మానవ విలువల శక్తివంతమైన ప్రతీక”గా అభివర్ణించారు. అలాగే ఇది భారత్–యూఏఈ మధ్య గాఢమైన స్నేహానికి ప్రతిబింబం అని తెలిపారు.

వేడుకల్లో “మందిర సంభాషణ” పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనిలో రాజనయికులు, వివిధ దేశాల ప్రతినిధులు ఈ మందిరాన్ని.. పారంపర్యం, ఆధునిక కూటనీతి మధ్య వంతెనగా అభివర్ణించారు. ఈ వేడుకల్లో పిల్లలు స్వయంలో సానుకూలత, కుటుంబ విలువలు, జాతీయ సదభావం, పర్యావరణ బాధ్యత.. నాలుగు సమూహ సంకల్పాలకు నాయకత్వం వహించారు. ఇవి మందిరం భవిష్యత్ తరాలపై పెట్టుకున్న ఆశలను తెలియజేస్తున్నాయి.

Sheikh Nahyan bin Mubarak Al Nahyan

ఈ మందిరం సంప్రదాయ శిల్పకళను, ఆధునిక స్థిరత్వ భావనను కలిపి నిర్మించిన గొప్ప ఉదాహరణ. కానీ.. దీనికన్నా పెద్దది దీని ప్రభావమే. దేవుడిపై నమ్మకం ప్రేరేపించడం, కుటుంబాలను బలోపేతం చేయడం, సమాజ సేవ చేయడం, ప్రపంచంలో శాంతి–సౌహార్దాన్ని పెంపొందించడం.. ఇదే దీని అసలు బలం. ఇప్పుడు మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న BAPS హిందూ మందిరం.. దేవుడిపై నమ్మకం, సేవ, ఐక్యతతో ప్రపంచాన్ని మరింత సమరసంగా మార్చొచ్చని మరోసారి నిరూపిస్తోంది.

Follow Us