AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Badrinath Temple: బద్రీనాథ్ నాథ్‌ను ఇల వైకుంఠం అని ఎందుకు పిలుస్తారు? స్వామిని ఎలా దర్శించుకోవాలో తెలుసా

హిందూమత విశ్వాసాలలో ఛార్ ధామ్ యాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పుణ్యక్షేత్రాలలో బద్రీనాథ్ ఒకటి. ఈ ధామ్‌ను భూలోక వైకుంఠం అని కూడా పిలుస్తారు. అందుకే ఈ ప్రదేశం చార్ ధామ్ యాత్రలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నట్లు పరిగణించబడుతుంది. ప్రతి భక్తుడు చార్ ధామ్ యాత్ర సమయంలో బద్రీనాథ్ ధామ్‌ను ఖచ్చితంగా సందర్శిస్తాడు. బద్రీనాథ్‌ను ఇల వైకుంఠం అని కూడా పిలుస్తారు.

Badrinath Temple: బద్రీనాథ్ నాథ్‌ను ఇల వైకుంఠం అని ఎందుకు పిలుస్తారు? స్వామిని ఎలా దర్శించుకోవాలో తెలుసా
Badrinath Temple
Surya Kala
|

Updated on: May 04, 2025 | 3:54 PM

Share

చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. బద్రీనాథ్ ధామ్ తలుపులు (మే 4న) ఈ రోజున తెరుచుకున్నాయి. ఇప్పటికే యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరవబడ్డాయి. బద్రీనాథ్ ప్రయాణం కూడా త్వరలో ప్రారంభం కానుంది. చార్ ధామ్ యాత్ర హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. నాలుగు ధామాలలో ఒకటైన బద్రీనాథ్ ధామ్‌ ఇల వైకుంఠం అని కూడా పిలుస్తారు. అయితే ఈ రోజు బద్రీనాథ్ ధామ్‌ను భూమి వైకుంఠం అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

బద్రీనాథ్ ధామ్‌ను ఇల వైకుంఠం అని ఎందుకు పిలుస్తారు?

నాలుగు ధామాలలో బద్రీనాథ్ ధామానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని భావిస్తారు. అందుకే దీనిని ఇల వైకుంఠ ధామం అని కూడా పిలుస్తారు. కారణం శ్రీ మహా విష్ణువు బద్రీనాథ్ ధామ్‌లో నివసిస్తున్నాడని నమ్మకం. అందుకే దీనికి హిందూ మతంలో ప్రధాన హోదా ఇవ్వబడింది. ఎవరైనా సరే తమ జీవితంలో ఒక్కసారైనా బద్రీనాథ్‌ను సందర్శిస్తే.. అతను జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడని విశ్వాసం ఉంది. అందుకే దీనిని దివ్య ప్రపంచం అని కూడా అంటారు.

బద్రీనాథ్‌లో ఏ దేవుని విగ్రహం ఉంది?

బద్రీనారాయణుడు అని పిలువబడే శ్రీ మహా విష్ణువును బద్రీనాథ్ ధామ్‌లో పూజిస్తారు. ఇక్కడ మహా విష్ణువు స్వయంభువుగా వెలసిన ఒక మీటరు ఎత్తున్న నల్లరాతి విగ్రహం ఇక్కడ ప్రతిష్టించబడింది. దీనిని ఆది శంకరాచార్యులు నారద కుండం నుంచి బయటకు తీసిన తర్వాత స్థాపించారు. ఈ విగ్రహం కుడి వైపున కుబేర దేవుడు, లక్ష్మీ దేవి, నారాయణ విగ్రహాలు కూడా ప్రతిష్టించబడ్డాయి. ఈ విగ్రహం విష్ణువు ఎనిమిది స్వయంభువైన విగ్రహాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

బద్రీనాథ్ ధామ్‌లో విష్ణు దర్శనం ఎలా చేసుకోవాలంటే

  1. బద్రీనాథ్ ధామ్ సందర్శించాలంటే మీరు ఉదయాన్నే నిద్రలేచి వేడి నీరు ఉన్న చెరువులో స్నానం చేయాలి.
  2. వేడి చెరువులో స్నానం చేసిన తర్వాత మీరు కొత్త బట్టలు ధరించాలి.
  3. తరువాత ఆది ఈశ్వర మహాదేవుడి ఆలయాన్ని సందర్శించాలి.
  4. దీని తరువాత అక్కడ అందుబాటులో ఉన్న ప్రసాదాన్ని తీసుకొని దేవుని దర్శనం చేసుకోవాలి.
  5. బద్రీనాథ్ ఆలయం అలకనంద నది.. పర్వతాల మధ్య ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.