
Jyeshtha Masam Significance: ఈ సంవత్సరం తెలుగు పంచాంగ ప్రకారం మే 17 నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతోంది. సాధారణంగా సంవత్సరంలో 12 చాంద్రమాసాలు ఉంటాయి. అయితే సూర్య–చంద్ర గమనాల సమన్వయం కోసం సుమారు మూడు సంవత్సరాలకు ఒకసారి అదనంగా ఒక మాసం చేరుతుంది. దీనినే “అధిక మాసం” లేదా “పురుషోత్తమ మాసం” అని పిలుస్తారు. అందువల్ల ఈ సంవత్సరం 13 నెలలు ఉండటం ప్రత్యేకతగా భావిస్తున్నారు.
సాధారణంగా అధిక మాసంలో వివాహాలు వంటి శుభకార్యాలు నిర్వహించరు. కానీ వైదిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దానధర్మాలు, జపతపాలు, దేవతారాధనలు ఎంతో శ్రేయస్కరంగా భావిస్తారు. ఈ మాసంలో కొన్ని పుణ్య తిథులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
అధిక మాసంలో వచ్చే తొలి చంద్రదర్శనం. ఈ రోజు చంద్రుని దర్శించి ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత, శుభఫలితాలు కలుగుతాయని విశ్వాసం.
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
ధ్వజారోహణంతో శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాల ప్రారంభం.
రోహిణి కార్తె ప్రారంభం.
మూడేళ్లకు ఒకసారి వచ్చే విశిష్ట ఏకాదశి. తిరుపతిలో గరుడోత్సవం నిర్వహిస్తారు.
నారాయణవనం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. పక్ష ప్రదోషం కూడా ఇదే రోజు.
కర్తరి త్యాగం.
శ్రీ గోవిందరాజ స్వామివారి చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాల ముగింపు.
సంకష్టహర చవితి.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం.
శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సమాప్తి.
జూన్ 11 – గురువారం
బహుళ ద్వాదశి/త్రయోదశి
పక్ష ప్రదోషం.
శని త్రయోదశి, మాస శివరాత్రి.
ఈ రోజుతో అధిక జ్యేష్ఠ మాసం ముగుస్తుంది.
అధిక మాసాన్ని “పురుషోత్తమ మాసం” అని కూడా పిలుస్తారు. ఈ మాసానికి శ్రీ మహావిష్ణువు అధిపతిగా పురాణాలు పేర్కొంటాయి. అందువల్ల ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం, గీతా పఠనం, దానం, ఉపవాసం, భక్తి సేవలు చేయడం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. ఈ మాసంలో భక్తితో చేసిన జపాలు, తపస్సులు, పూజలు, దానధర్మాలకు అధిక ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల ఈ పవిత్ర కాలాన్ని ఆధ్యాత్మిక సాధనకు వినియోగించుకోవడం శ్రేయస్కరం.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)