మలేసియా ఓపెన్ నుంచి సైనా ఔట్..!
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి సైనా నెహ్వాల్ నిష్క్రమించింది. బుధవారం జరిగిన మొదటి రౌండ్ లో థాయిలాండ్ కు చెందిన చోచువాంగ్ చేతిలో 22-20, 15-21, 10-21 తేడాతో పరాజయం చవి చూసింది. కాగా ఆరోగ్య సమస్యల వల్ల గతేడాది స్విస్ ఓపెన్ నుంచి సైనా నెహ్వాల్ అర్ధాంతరంగా వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత సైనా ఆడుతున్న మొదటి మ్యాచ్ ఇదే కావడంతో అభిమానులు ఆసక్తి చూపించారు. కానీ సైనా నెహ్వాల్ […]
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి సైనా నెహ్వాల్ నిష్క్రమించింది. బుధవారం జరిగిన మొదటి రౌండ్ లో థాయిలాండ్ కు చెందిన చోచువాంగ్ చేతిలో 22-20, 15-21, 10-21 తేడాతో పరాజయం చవి చూసింది. కాగా ఆరోగ్య సమస్యల వల్ల గతేడాది స్విస్ ఓపెన్ నుంచి సైనా నెహ్వాల్ అర్ధాంతరంగా వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత సైనా ఆడుతున్న మొదటి మ్యాచ్ ఇదే కావడంతో అభిమానులు ఆసక్తి చూపించారు. కానీ సైనా నెహ్వాల్ ఈ మ్యాచ్ లో ఘోరంగా పరాజయం పాలయ్యింది.
ఇక అటు మిక్స్డ్ డబుల్స్ లో సిక్కిరెడ్డి- ప్రణవ్ చోప్రా జోడీ ముందంజ వేసింది. మంగళవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి- ప్రణవ్ జంట 22-20, 24-22తో సామ్ మాగీ- క్లోయ్ మాగీ (ఐర్లాండ్) జోడీపై విజయం సాధించింది.