క్రికెట్ ఫ్యాన్స్ కు బీసీసీఐ గుడ్న్యూస్..
కరోనా కట్టడి చర్యల్లో దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ అమలు అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్న ప్రజల కోసం ఇప్పటికే దూరదర్శన్ పలు పాత కార్యక్రమాలను రీ టెలికాస్ట్ చేస్తుంది. ఈ క్రమంలో క్రికెట్ ఫ్యాన్స్ కు కూడా బీసీసీఐ శుభవార్త చెప్పింది. లాక్డౌన్ సమయం ఇంకా 8 రోజులు ఉండటంతో..వారిని ఇంటివద్దే ఉంచేందుకు భారత క్రికెట్ టీమ్ ఆడిన పాత మ్యాచులను తిరిగి ప్రసారం చేయనున్నట్లు వెల్లడించింది. 2000 సంవత్సరం […]
కరోనా కట్టడి చర్యల్లో దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ అమలు అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్న ప్రజల కోసం ఇప్పటికే దూరదర్శన్ పలు పాత కార్యక్రమాలను రీ టెలికాస్ట్ చేస్తుంది. ఈ క్రమంలో క్రికెట్ ఫ్యాన్స్ కు కూడా బీసీసీఐ శుభవార్త చెప్పింది. లాక్డౌన్ సమయం ఇంకా 8 రోజులు ఉండటంతో..వారిని ఇంటివద్దే ఉంచేందుకు భారత క్రికెట్ టీమ్ ఆడిన పాత మ్యాచులను తిరిగి ప్రసారం చేయనున్నట్లు వెల్లడించింది. 2000 సంవత్సరం ప్రారంభం నుంచి భారత క్రికెట్ మ్యాచ్ల హైలెట్స్.. ఏప్రిల్ 7 నుండి ప్రసారం చేయనున్నట్లు బిసిసిఐ సోమవారం ప్రకటించింది. మూడు మ్యాచుల హైలెట్స్ .. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ప్రతిరోజు టెలికాస్ట్ చేస్తామని పేర్కొంది. వీటిని డీడీ స్పోర్ట్స్ ఛానెల్లో వీక్షించవచ్చని తెలిపింది.
ఈ మ్యాచ్లలో 2003 లో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన ట్రై-సిరీస్, 2000 లో దక్షిణాఫ్రికా భారత పర్యటన, 2001 లో ఆస్ట్రేలియా భారత పర్యటన (వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ రోజంతా బ్యాటింగ్ చేసి అద్భుత విజయాన్ని అందించిన ప్రసిద్ధ కోల్కతా టెస్టుతో సహా).. 2002 లో వెస్టిండీస్ భారత పర్యటన , 2005 లో శ్రీలంక భారత పర్యటన లాంటి సూపర్ మ్యాచ్ లు ఉన్నాయి.
The 2000s cricket rewind ?️?️
The BCCI and Government of India bring you cricket highlights from the past.
Sit back and enjoy the action on @ddsportschannel.#StayHomeStaySafe @SGanguly99 @JayShah @ThakurArunS pic.twitter.com/nW3kePeAII
— BCCI (@BCCI) April 6, 2020