ఫిట్ నెస్ కోసం కష్టపడుతోన్న దిల్ రాజు.. భార్యతో కలిసి బాడ్మింటన్..
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గురించి తెలియని సినీ ప్రేక్షకులుండరు. కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు. సక్సెస్ కి చిరునామా. దిల్ రాజు ఏదైనా సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారంటే అది ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటూంటారు. అంతటి బ్రాండ్ ఇమేజ్ ని సొంతం...
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గురించి తెలియని సినీ ప్రేక్షకులుండరు. కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు. సక్సెస్ కి చిరునామా. దిల్ రాజు ఏదైనా సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారంటే అది ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటూంటారు. అంతటి బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు దిల్ రాజు. ఇక ఆయన లాక్ డౌన్ కాలంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి భార్య అనిత చనిపోయాక ఒంటరిగా ఉన్న దిల్ రాజు.. ఈ మధ్య వైఘా రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి అయ్యాక దిల్ రాజు పూర్తిగా తన లైఫ్ స్టైల్ ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. అందులోనూ ప్రస్తుతం ఇప్పుడు సినిమా షూటింగులు కూడా లేకపోవడంతో పూర్తిగా ఫిట్ నెస్ పై దృష్టి పెట్టారు దిల్ రాజు.
వీరిద్దరి పెళ్లి తర్వాత తీసుకున్న మొదటి సెల్ఫీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక వివాహం అనంతరం మొదటిసారిగా వీరిద్దరూ కలిసి తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. అప్పటి ఫొటోలు కూడా కొన్ని సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా వీరిద్దరూ కలిసి దిగిన మరో ఫొటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పెళ్లి తరువాత దిల్ రాజు తన ఫిట్ నెస్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన బాడీకి బాగా పని చెబుతున్నారు. జిమ్లో వర్కౌట్లు చేస్తూ, భార్యతో కలిసి బాడ్మింటన్ ఆడుతున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి తీసుకున్న సెల్ఫీ మరోసారి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.