Coronavirus: పది రోజుల్లోనే అధ్యక్ష ఎన్నికలు.. కరోనా బారిన పడిన దేశ అధ్యక్షుడు.. బహిరంగ సమావేశాలు రద్దు
Coronavirus: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచ....
Coronavirus: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశ ప్రధానులు, అధ్యక్షులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో డీ సౌసా (73) కూడా చేరిపోయారు. మార్సెలోకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. జనవరి 24న పోర్చుగల్లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి.
మార్సెలో డీ సౌసా రెండో సారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు అనేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అధ్యక్ష ఎన్నికల బిజీలో ఉన్న మార్సెలో ఇప్పుడు కరోనా బారిన పడ్డారు. కరోనా సోకడంతో అన్ని బహిరంగ సమావేశాలు రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇక మార్సెలో 2016లో అధికార బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు రెండోసారి అధ్యక్ష రేసులో ఉన్నారు. కాగా, పోర్చుగల్లో ఇప్పటి వరకు 4.8 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులున్నాయి.
ఇలా కరోనా వైరస్ ప్రముఖులందరినీ వెంటాడుతుండటంతో ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. వైరస్కు వ్యాక్సిన్ లేని కారణంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుండటంతో కరోనా కేసులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్ను అందుబాటులోకి తీవ్రంగా కృషి చేస్తున్నాయి.
Also Read:
ప్రపంచ కరోనా అప్డేట్.. గడిచిన 24 గంటల్లో 5,78,430 పాజిటివ్ కేసులు, 9,289 మరణాలు..