Pulichintala: టీడీపీ నేతలకు పైత్యం తలకు ఎక్కింది.. పులిచింతల కాంట్రాక్ట్ సంస్థను ఫైనల్ చేసింది చంద్రబాబు : సజ్జల

టీడీపీ నేతలకు పైత్యం తలకు ఎక్కింది.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. 2004 లో

Pulichintala: టీడీపీ నేతలకు పైత్యం తలకు ఎక్కింది.. పులిచింతల కాంట్రాక్ట్ సంస్థను ఫైనల్ చేసింది చంద్రబాబు : సజ్జల
Sajjala Ramakrishna Reddy

Updated on: Aug 07, 2021 | 2:53 PM

Sajjala Ramakrishna Reddy – Sajjala: టీడీపీ నేతలకు పైత్యం తలకు ఎక్కింది.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. 2004 లో పులిచింతల కాంట్రాక్ట్ కంపెనీ సంస్థను ఫైనల్ చేసింది చంద్రబాబు అని ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీ నేత బాలినేని ఫ్యామిలీకి చంద్రబాబు పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్టు ఇచ్చారని సజ్జల ఆరోపించారు.

ఇప్పటికైనా పులిచింతల ప్రాజెక్టు క్రెడిట్ వైస్సార్‌కి ఇచ్చిన్నందుకు సంతోషమంటూ ఎద్దేవా చేసిన సజ్జల.. 90 శాతం ప్రాజెక్టు వైస్సార్ హయాంలో పూర్తి అయిందని చెప్పారు. గేట్లు ఏర్పాటు చేసింది చంద్రబాబు హయాంలోనే.. 2015 లో క్వాలిటీ కమిటీ నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదు అని సజ్జల ఆరోపించారు.

పులిచింతల గేట్లు ఎవరి హయాంలో పెట్టారన్నది ముఖ్యమని చెప్పిన సజ్జల.. టెక్నీకల్ కమిటీ నివేదికను ఎందుకు ఫాలో కాలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు, బీజేపీ సీఎంలు చేసిన అప్పులు వీళ్లకి కనిపించడం లేదా.. అంటూ బీజేపీ మీద అమరావతిలో ఎదురుదాడికి దిగారు సజ్జల.

Read also:  CM KCR: తెలంగాణ వ్యాప్తంగా హర్షాతిరేకాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు

Loading...
Unable to load recommendations.
Follow Us