ఆ విషయంలో కాంగ్రెస్‌, బీజేపీది ఒకటే వైఖరి.. పట్టభద్రుల ఓట్లడిగే హక్కు ఆ పార్టీలకు లేదన్న నిరంజన్‌రెడ్డి

కొత్త పరిశ్రమలు పెట్టి ప్రజలకు ఉపాధి కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం.. ఉన్న ఉపాధిని కూడా లేకుండా చేస్తుందని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. గ్యాస్, పెట్రోల్, డీజీల్ ధరలు పెంచి..

ఆ విషయంలో కాంగ్రెస్‌, బీజేపీది ఒకటే వైఖరి.. పట్టభద్రుల ఓట్లడిగే హక్కు ఆ పార్టీలకు లేదన్న నిరంజన్‌రెడ్డి
Follow us

|

Updated on: Mar 03, 2021 | 1:23 PM

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గ్యాడ్యుయేట్‌ ఓటర్లను ఆకర్షించేందుకు రెండు పార్టీలు నిరుద్యోగ సమస్యను ప్రధాన ఎజెండాగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో వనపర్తిలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. దేశంలో ప్రభుత్వ సెక్టార్‌లోని సంస్థలను అమ్మివేస్తూ ఉన్న ఉద్యోగాలు మోడి సర్కారు ఊడగొడుతుందని నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొత్త పరిశ్రమలు పెట్టి ప్రజలకు ఉపాధి కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం.. ఉన్న ఉపాధిని కూడా లేకుండా చేస్తుందని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. గ్యాస్, పెట్రోల్, డీజీల్ ధరలు పెంచి కేంద్రం సామాన్యుల నడ్డి విరుస్తుందని విమర్శించారు. దేశంలో సంపద దోచుకున్న వ్యాపారవేత్తలను కేంద్ర ప్రభుత్వం దగ్గరుండి క్షేమంగా విమానాలు ఎక్కించి విదేశాలకు పంపిస్తుందని ఆరోపించారు. పట్టభద్రులకు ఓ సామాన్యుడుగా విజ్ఞప్తి చేస్తున్నాను .. ఆలోచించి ఓటువేయండి .. అభివృద్ది చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలవండని నిరంజన్‌రెడ్డి అన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ఎన్నో వనరులున్న కేంద్రప్రభుత్వం లాభాల్లోకి తేలేకపోతే ప్రైవేటు సంస్థలు ఎలా తెస్తాయని మంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థలు కేంద్రం ప్రైవేటుకు అప్పగిస్తే బడుగు, బలహీనవర్గాల పట్టభద్రుల పరిస్థితి ఏంటని అన్నారు. – జేఎన్ యూ విశ్వవిద్యాలయంలో చదివేది దేశంలోని సామాన్య విద్యార్థులు .. ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థ .. అలాంటిచోట ఆంక్షలతో విద్యార్థులను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో 10 శాతం ఉన్న వృద్దిరేటు మోడీ పాలనలో ఇప్పుడు – 7 శాతానికి పడిపోయింది .. ఏడేళ్లలో 17 శాతం క్షీణించిందని వివరించారు. మోడీ పాలనను, బీజేపీ పార్టీని తిరస్కరించడానికి ఈ ఒక్క కారణం చాలన్నారు.

గత ఏడాది కోవిడ్ వచ్చింది మరి అంతకుముందు ఆరేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను మించి దేశంలోని ఇతర రాష్ట్రాలలో ఎక్కడైనా అమలుచేసి విపక్షాలు ఓట్లడగాలి .. కానీ కేసీఆర్ గారి మీద ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కొత్త జిల్లాల మూలంగా మారిన జోనల్ వ్యవస్థకు కేంద్రం అనుమతించకుండా ఉద్యోగుల పదోన్నతులు అడ్డుకుంటుందని ఆరోపించారు. నూతన వ్యవసాయచట్టాలతో కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్లకు అండగా నిలిచింది. నిత్యవసరాల చట్టం మార్చి ఎవరైనా ఎంతైనా నిలువ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

కాంగ్రెస్ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కొత్త వ్యవసాయ చట్టాలను ప్రస్తావించిందని మంత్రి నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ ఆలోచనలను మోడీ అమలులోకి తెచ్చారు .. కొత్త చట్టాల గురించి మాట్లాడే హక్కు ఆ రెండు పార్టీలకు లేదు .. ఆ విషయంలో ఆ రెండు పార్టీలదీ ఒకటే వైఖరి అని విమర్శించారు. మాజీ ప్రధాని కూతురైనా వాణిదేవిది సాధారణ జీవితమే. విద్యావేత్తగా ఆడంబరాలకు దూరంగా జీవించారు. పాలమూరు కోడలుగా వారికి ఓట్లేసి గెలిపిద్దాం. వాణిదేవి తప్ప ఎవరు గెలిచినా సమస్యలు పరిష్కరించే అవకాశం లేదన్నారు మంత్రి. వాణిదేవి నేరుగా సమస్యలు సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించగలుగుతారని చెప్పారు.

ఆరున్నరేళ్ల పసికూన తెలంగాణ రాష్ట్రం .. 28 రాష్ట్రాలలో తెలంగాణది ఆరున్నరేళ్ల ప్రస్థానమే. అయినా దేశంలో పురోగమిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ ముందుంది. దేశ తలసరి జీడీపీ కన్నా తెలంగాణ జీడీపీ ఎంతో ఎక్కువగా ఉంది. ఉద్యోగాలు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేది తెలంగాణ ప్రభుత్వమే. రాష్ట్రంలోని 60 లక్షల రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆసరాగా నిలుస్తుంది .. వారి కుటుంబాలను అర్థికంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం పనిచేస్తున్నది. పట్టభద్రులు, ఉద్యోగులు విజ్ఞతతో టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు.

Read More:

కాంగ్రెస్‌ పార్టీకి ఇందిరా శోభన్‌ రాజీనామా.. షర్మిలతో భేటీ అయిన టీపీసీసీ అధికార ప్రతినిధి

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!