Handloom Day: నాడు స్వర్ణయుగంగా ఉన్న ఆ పథకాలను రద్దుచేసి చీకట్లలోకి నెట్టేశారు: చంద్రబాబు
పోగును వస్త్రంగా మలిచి.. మానవాళికి నాగరికతను నేర్పిన చేనేత సోదరులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అంటూ సందేశమిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..

Chandrababu: పోగును వస్త్రంగా మలిచి.. మానవాళికి నాగరికతను నేర్పిన చేనేత సోదరులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అంటూ సందేశమిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లో గత తెలుగుదేశం పాలనలో నేతన్నలకిచ్చే త్రిఫ్టును 8 నుండి 16శాతానికి పెంచామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
నూలుపై సబ్సిడీని 10 నుండి 40శాతానికి పెంచామని.. ఏపీలో చేనేత కార్మికులకు ఏడాదికి రూ.50వేలకు పైగా వచ్చే రాయితీలను వైసీపీ ప్రభుత్వం రద్దుచేసి రూ.24 వేలతో సర్దుకోమంటూ తీరని ద్రోహం చేస్తోందని చంద్రబాబు విమర్శించారు.
నేతన్నల అభివృద్ధిని, అభ్యున్నతిని వైసీపీ ప్రభుత్వం ప్రశ్నార్ధకం చేస్తోందని తన ట్విట్టర్ ముఖంగా విమర్శించిన చంద్రబాబు.. నాడు చేనేతలకు స్వర్ణయుగంగా ఉన్న పథకాలను రద్దుచేసి చీకట్లలోకి నెట్టేశారన్నారు. తెలుగుదేశం హయాంలో అందించిన ప్రోత్సాహకాలు, రాయితీలు నేతన్నలకు ఇవ్వాలని బాబు డిమాండ్ చేశారు.
అలాగే కరోనాతో నష్టపోయిన కార్మికులకు పరిహారం కూడా అందజేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని చంద్రబాబు చెప్పారు.
ఏపీలో చేనేత కార్మికులకు ఏడాదికి రూ.50వేలకు పైగా వచ్చే రాయితీలను వైసీపీ ప్రభుత్వం రద్దుచేసి రూ.24 వేలతో సర్దుకోమంటూ తీరని ద్రోహం చేస్తోంది. నేతన్నల అభివృద్ధిని, అభ్యున్నతిని ఈ ప్రభుత్వం ప్రశ్నార్ధకం చేస్తోంది.(3/4)
— N Chandrababu Naidu (@ncbn) August 7, 2021