నేను తప్పు చేసి ఉంటే క్షమించండి: బోడె ప్రసాద్

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ బుల్లెట్‌పై తన నియోజకవర్గం పెనమలూరులో తిరిగారు. తనకు ఓటు వేసిన వాళ్లకు, వేయని వారికి కృతజ్ఞతలు చెబుతూ ముందుకు సాగారు. తానేదైనా తప్పు చేసి ఉంటే క్షమించాలని.. మనసులో తనపై కోపం ఉంటే తీసేయాలని కోరారు బోడె ప్రసాద్. గ్రామం మొత్తం తిరుగుతూ ప్రతీ మనిషికి విన్నవించారు. ఆయనపై ప్రజలు కూడా సానుకూలంగా స్పందించారు. ఈయనపై 10 వేల ఓట్ల తేడాతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పార్థసారథి గెలుపొందారు. […]

నేను తప్పు చేసి ఉంటే క్షమించండి: బోడె ప్రసాద్

Updated on: May 25, 2019 | 7:41 PM

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ బుల్లెట్‌పై తన నియోజకవర్గం పెనమలూరులో తిరిగారు. తనకు ఓటు వేసిన వాళ్లకు, వేయని వారికి కృతజ్ఞతలు చెబుతూ ముందుకు సాగారు. తానేదైనా తప్పు చేసి ఉంటే క్షమించాలని.. మనసులో తనపై కోపం ఉంటే తీసేయాలని కోరారు బోడె ప్రసాద్. గ్రామం మొత్తం తిరుగుతూ ప్రతీ మనిషికి విన్నవించారు. ఆయనపై ప్రజలు కూడా సానుకూలంగా స్పందించారు. ఈయనపై 10 వేల ఓట్ల తేడాతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పార్థసారథి గెలుపొందారు.

Follow Us