కాషాయ కండువా కప్పుకున్న పారాలింపియన్ దీపామాలిక్

| Edited By:

Mar 25, 2019 | 7:46 PM

న్యూఢిల్లీ : పారాలింపియన్ దీపామాలిక్ బీజేపీ గూటికి చేరారు. హర్యానా బీజేపీ శాఖ అధ్యక్షుడు సుభాష్ బరాలా దీపామాలిక్ కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం దీపామాలిక్ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా దీపామాలిక్ మీడియాతో మాట్లాడుతూ..ప్రధాని మోదీ తన ఆలోచనలతో మహిళల సాధికారతకు కృషి చేశారని అన్నారు. మహిళలకు కీలకమైన మంత్రిత్వ శాఖలను కేటాయించారని.. దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేశారని పేర్కొన్నారు. పారాలింపిక్ గేమ్స్ లో మెడల్ సాధించిన […]

కాషాయ కండువా కప్పుకున్న పారాలింపియన్ దీపామాలిక్
Follow us on

న్యూఢిల్లీ : పారాలింపియన్ దీపామాలిక్ బీజేపీ గూటికి చేరారు. హర్యానా బీజేపీ శాఖ అధ్యక్షుడు సుభాష్ బరాలా దీపామాలిక్ కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం దీపామాలిక్ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా దీపామాలిక్ మీడియాతో మాట్లాడుతూ..ప్రధాని మోదీ తన ఆలోచనలతో మహిళల సాధికారతకు కృషి చేశారని అన్నారు. మహిళలకు కీలకమైన మంత్రిత్వ శాఖలను కేటాయించారని.. దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేశారని పేర్కొన్నారు. పారాలింపిక్ గేమ్స్ లో మెడల్ సాధించిన తొలి భారత మహిళగా దీపామాలిక్ రికార్డు సృష్టించారు.