AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగాల్ లో ఎన్నికల అనంతర హింస నిజమే.. జాతీయ మానవ హక్కుల సంఘం నిర్ధారణ.. మమత ఖండన

బెంగాల్ లో ఎన్నికల అనంతర హింస నిజమేనని జాతీయ మానవ హక్కుల కమిషన్ తన నివేదికలో తెలిపింది. హింసకు గురైన అల్లర్ల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని, వారి ఖర్మానికి వారిని వదిలివేసిందని పేర్కొంది.

బెంగాల్ లో ఎన్నికల అనంతర హింస నిజమే.. జాతీయ మానవ హక్కుల సంఘం నిర్ధారణ.. మమత ఖండన
Mamata Banerjee
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 15, 2021 | 7:52 PM

Share

బెంగాల్ లో ఎన్నికల అనంతర హింస నిజమేనని జాతీయ మానవ హక్కుల కమిషన్ తన నివేదికలో తెలిపింది. హింసకు గురైన అల్లర్ల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని, వారి ఖర్మానికి వారిని వదిలివేసిందని పేర్కొంది. హత్యలు, అత్యాచారాలు వంటి నేరాలపై సీబీఐ దర్యాప్తు జరగాలని, ఈ కేసుల విచారణ రాష్ట్రం బయట కోర్టులు విచారించాలని సిఫారసు చేసింది.ఈ మేరకు ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. రాష్ట్రంలో పరిస్థితి ‘రూల్ ఆఫ్ లా ‘ బదులు ‘ మేనిఫెస్టెషన్ ఆఫ్ లా ఆఫ్ రూలర్’ (పాలకులు చెప్పిందే న్యాయం) మాదిరి ఉందని ఈ నివేదిక తెలిపింది. కలకత్తా హైకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు రాష్ట్రంలోని పరిస్థితిని సమీక్షించి తమ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. విపక్ష బీజేపీ మద్దతుదారులపట్ల పాలక పార్టీ సపోర్టర్లు దాడులు జరిపారన్న ఆరోపణలకు మద్దతుగా వీరు తమ నివేదికలో ఆయా అంశాలను ప్రస్తావించారు. హింస కారణంగా వేలాది ప్రజల జీవితాలు, వారి ఆర్ధిక స్థితిగతులు దారుణంగా మారాయని, ఇప్పటికీ కొందరు నిర్వాసితులు తమ ఇళ్లకు చేరుకోలేకపోతున్నారని, పోలీసులంటే వారు భయపడుతున్నారని ఈ నివేదిక తెలిపింది.

లైంగిక నేరాలు జరిగినా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఇందులో పేర్కొన్నారు. అయితే సీఎం మమతాబెనర్జీ ఈ రిపోర్టును ఖండిస్తూ..ఇదంతా బీజేపీ రాజకీయ కక్ష అని ఆరోపించారు. ఈ సభ్యులు మొదట ప్రభుత్వ అభిప్రాయాలను కూడా సేకరించి ఉండవలసిందన్నారు. ఈ రిపోర్టును మీడియాకు బీజేపీ లీక్ చేసిందని ఆమె ఆరోపించారు. ఈ సభ్యులు దీన్ని తొలుత కోర్టుకు సమర్పించాల్సి ఉండింది అని ఆమె వ్యాఖ్యానించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Breaking: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి తేదీ ఖరారు..

లడాఖ్ సరిహద్దుల్లో చైనా ‘బూచి’.. శరవేగంగా కాంక్రీట్ కట్టడాల నిర్మాణం.. రాహుల్ గాంధీ ఆందోళన నిజమేనా ?

Follow Us
టెన్త్ పాసైన వారికి తెలంగాణ Polycet 2026 పరీక్ష.. పూర్తి వివరాలు
టెన్త్ పాసైన వారికి తెలంగాణ Polycet 2026 పరీక్ష.. పూర్తి వివరాలు
IND vs WI సెమీఫైనల్లో కీలక పాత్ర ఎవరిది.. ఎంట్రీ ఇస్తే షాకేనా..?
IND vs WI సెమీఫైనల్లో కీలక పాత్ర ఎవరిది.. ఎంట్రీ ఇస్తే షాకేనా..?
ఖర్జూరాలను ఈ టైమ్‌లో తింటున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే ..
ఖర్జూరాలను ఈ టైమ్‌లో తింటున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే ..
మరో 2 రోజుల్లో RRB రైల్వే అడ్మిట్ కార్డులు.. సీటీ వివరాలు చూశారా?
మరో 2 రోజుల్లో RRB రైల్వే అడ్మిట్ కార్డులు.. సీటీ వివరాలు చూశారా?
జీవితంలో ఇలాంటి వ్యక్తులకు అస్సలు సాయం చేయకండి.. చేసి బాధపడకండి
జీవితంలో ఇలాంటి వ్యక్తులకు అస్సలు సాయం చేయకండి.. చేసి బాధపడకండి
వైరల్‌ వీడియోపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ!
వైరల్‌ వీడియోపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ!
పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈ పని చేస్తే ఇక అంతే..
పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈ పని చేస్తే ఇక అంతే..
మీరు చెడు అనుకునే ఈ ఆహారాలన్నీ పళ్లకు ఎంత మంచివో తెలుసా..?
మీరు చెడు అనుకునే ఈ ఆహారాలన్నీ పళ్లకు ఎంత మంచివో తెలుసా..?
చరిత్రలో నిలిచిపోయే వీడ్కోలు..ఆస్ట్రేలియా కెప్టెన్ విశ్వరూపం
చరిత్రలో నిలిచిపోయే వీడ్కోలు..ఆస్ట్రేలియా కెప్టెన్ విశ్వరూపం
ఈ ఆకును మజ్జిగలో కలిపి తాగితే ఆ సమస్యకు చూమంత్రం వేసినట్టే!
ఈ ఆకును మజ్జిగలో కలిపి తాగితే ఆ సమస్యకు చూమంత్రం వేసినట్టే!