మోదీ ఓ ఔరంగజేబ్… కాంగ్రెస్ నేత ఫైర్

| Edited By:

May 08, 2019 | 4:21 PM

ప్రముఖ కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ ప్రధాని నరేంద్రమోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారణాసి నగరంలోని వందలాది ఆలయాలను కూలగొట్టించిన నరేంద్రమోదీ ‘ఆధునిక ఔరంగజేబ్’ అని సంజయ్ నిరుపమ్ ఆరోపించారు. ‘‘నేను వారణాసి నగరానికి వచ్చి చూస్తే వందలాది దేవాలయాలు ధ్వంసమై ఉన్నాయి. దీంతోపాటు విశ్వనాథుని దర్శించుకోవాలంటే 550 రూపాయల ఫీజు చెల్లించాలని నిబంధన పెట్టారు…అందుకే నేను మోదీ ఆధునిక ఔరంగజేబ్ అని భావిస్తున్నాను. ఆధునిక ఔరంగజేబ్ లా భక్తులపై జిజియా పన్ను విధించిన మోదీ చర్యలను […]

మోదీ ఓ ఔరంగజేబ్... కాంగ్రెస్ నేత ఫైర్
Follow us on

ప్రముఖ కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ ప్రధాని నరేంద్రమోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారణాసి నగరంలోని వందలాది ఆలయాలను కూలగొట్టించిన నరేంద్రమోదీ ‘ఆధునిక ఔరంగజేబ్’ అని సంజయ్ నిరుపమ్ ఆరోపించారు. ‘‘నేను వారణాసి నగరానికి వచ్చి చూస్తే వందలాది దేవాలయాలు ధ్వంసమై ఉన్నాయి. దీంతోపాటు విశ్వనాథుని దర్శించుకోవాలంటే 550 రూపాయల ఫీజు చెల్లించాలని నిబంధన పెట్టారు…అందుకే నేను మోదీ ఆధునిక ఔరంగజేబ్ అని భావిస్తున్నాను. ఆధునిక ఔరంగజేబ్ లా భక్తులపై జిజియా పన్ను విధించిన మోదీ చర్యలను నేను ఖండిస్తున్నాను’’ అని సంజయ్ నిరుపమ్ స్పష్టం చేశారు. తాను ఢిల్లీలో రాజీవ్ గాంధీ పేరిట ఓట్లు అడుగుతానని, కాని అమేథీలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ మోదీ పేరు పలికితే ఓటమి తప్పదని సంజయ్ జోస్యం చెప్పారు.