Nandyal MLA slams Bhuma Family: నంద్యాలలో రాజకీయం వేడెక్కింది. భూమా కుటుంబంపై ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైసీపీ నేత, దళిత న్యాయవాది సుబ్బరాయుడును టీడీపీ నాయకుడు హత్య చేయ్యడం ఆశ్చర్యం కల్గిస్తోందని ఆయన అన్నారు. హత్యచేసిన వ్యక్తి కేవలం భూమా కుటుంబంతో ఫోటోలు మాత్రమే దిగలేదని, అతడితో అక్రమ వ్యపారాలు చేశారని తెలిపారు. హత్య రాజకీయాలతో భయపెడితే ఇక్కడ భయపడే వాళ్లు ఎవరు లేరని, నంద్యాలలో భయం సృష్టించాలని చూస్తే ఎవరు ఊరికే ఉండరని తెలిపారు.( ఊబర్ స్టైలిష్ లుక్లో అదరగొట్టేస్తున్న కమల్)
ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుందని, భూమా కుటుంబ వలనే ఆళ్లగడ్డ అభివృద్ధికి నోచుకోలేదని.. 2014 నుంచి భూమా కుటుంబం తమ నాయకులపై అనేక దాడులు, హత్యయత్నాలకు పాల్పడ్డారని అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి తాము ఏనాడు కక్ష సాదింపు చర్యలకు పాల్పడలేదని, హత్య వెనకాల ఉన్న కుట్రదారుల ఎంతటి వారైనా.. వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి పేర్కొన్నారు.( రెస్టారెంట్కి అనుకోని అతిథి.. గప్చిప్ అయిపోయిన కస్టమర్లు)