ఫ్యాన్, సైకిల్ తుప్పు పట్టాయ్.. గ్లాస్ పగిలిపోతుంది: పాల్

|

Mar 24, 2019 | 4:57 PM

విజయవాడ: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. ఫ్యాన్, సైకిల్ తుప్పు పట్టిపోయాయ్ అని, గ్లాస్ పగిలిపోతుందని అన్నారు. ప్రజాశాంతి పార్టీని చూసి జగన్, విజయసాయి రెడ్డికి నిద్ర పట్టడంలేదు. చంద్రబాబుకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీదే విజయమంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. తమకుహెలికాప్టర్ గుర్తు కేటాయించకుండా ఉండేందుకు విజయసాయి రెడ్డి ఢిల్లీలో కూర్చొని ప్రయత్నించారని విమర్శించారు. కానీ అలా చేయనందుకు ప్రధాన ఎన్నికల కమీషన్ గారికి కృతజ్ఞతలు. తనకు […]

ఫ్యాన్, సైకిల్ తుప్పు పట్టాయ్.. గ్లాస్ పగిలిపోతుంది: పాల్
Follow us on

విజయవాడ: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. ఫ్యాన్, సైకిల్ తుప్పు పట్టిపోయాయ్ అని, గ్లాస్ పగిలిపోతుందని అన్నారు. ప్రజాశాంతి పార్టీని చూసి జగన్, విజయసాయి రెడ్డికి నిద్ర పట్టడంలేదు. చంద్రబాబుకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీదే విజయమంటూ విశ్వాసం వ్యక్తం చేశారు.

తమకుహెలికాప్టర్ గుర్తు కేటాయించకుండా ఉండేందుకు విజయసాయి రెడ్డి ఢిల్లీలో కూర్చొని ప్రయత్నించారని విమర్శించారు. కానీ అలా చేయనందుకు ప్రధాన ఎన్నికల కమీషన్ గారికి కృతజ్ఞతలు. తనకు ఎలక్షన్ కమీషన్ అధికారులు జడ్ ప్లస్ సెక్యూరిటీని కేటాయించారని తెలిపారు. ఆంధ్రాను అమెరికా చేసే ధైర్యం, సత్తా కేవలం కేఏ పాల్‌కు మాత్రమే ఉందని పాల్ అన్నారు.