నా తండ్రిని చంపిన వారిపై ఎలాంటి కోపం, ద్వేషం లేదు.. పుదుచ్చేరి పర్యటనలో ఆసక్తికర కామెంట్స్ చేసిన ..

|

Feb 18, 2021 | 8:03 AM

Rahul Gandhi Coments : తన తండ్రి రాజీవ్‌గాంధీని చంపిన వారిపై తనకు ఎలాంటి కోపం, ద్వేషం లేవని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ అన్నారు. పుదుచ్చేరి

నా తండ్రిని చంపిన వారిపై ఎలాంటి కోపం, ద్వేషం లేదు.. పుదుచ్చేరి పర్యటనలో ఆసక్తికర కామెంట్స్ చేసిన ..
Follow us on

Rahul Gandhi Coments : తన తండ్రి రాజీవ్‌గాంధీని చంపిన వారిపై తనకు ఎలాంటి కోపం, ద్వేషం లేవని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ అన్నారు. పుదుచ్చేరి పర్యటనలో భాగంగా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీని ఎల్‌టీటీఈ వారు హత్య చేసిన విషయమై ఓ విద్యార్థిని మాట్లాడుతూ ‘దోషులపై కోపం ఉందా?’ అని అడిగారు. దానికి రాహుల్‌గాంధీ స్పందిస్తూ.. ‘మా తండ్రిని హత్యచేయడం తీవ్రంగా బాధించింది. కానీ ఇప్పుడు ఆ దోషులపై ఎలాంటి కోపం, ద్వేషం లేవన్నారు.

ఈ సందర్భంగా ఓ విద్యార్థిని రాహుల్‌గాంధీ ఆటోగ్రాఫ్‌ తీసుకుని భావోద్వేగానికి గురికాగా ఆమెను దగ్గరికి తీసుకొని ఓదార్చారు. అంతకుముందు సీఎం నారాయణస్వామి సహా పార్టీ ముఖ్యనేతలతో రాహుల్‌ సమావేశమయ్యారు. ఆ తర్వాత సోలైయూర్‌ ప్రాంతంలో మత్స్యకారులతో మాట్లాడుతూ… ఓ పక్క పిల్లలను బడికి పంపలేక సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని, మరోపక్క కేంద్ర ప్రభుత్వం దేశంలోని సంపన్నులకు రూ.పది లక్షల కోట్లను రుణాలుగా ఇచ్చిందని ఆరోపించారు.

దేశంలో తొలిసారిగా ఓ మహిళకు ఉరిశిక్ష..? రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా తిరస్కరణ.. ఆదేశాలు జారీ చేసిన మథుర కోర్టు..