Etela Rajender Joins BJP: బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌… ఆయనతోపాటు మరికొందరు నేతలు

|

Jun 14, 2021 | 12:47 PM

మాజీ మంత్రి, తెలంగాణలోని కీలకనేత ఈటల రాజేందర్‌లో బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్ సమక్షంలో ఈటల కమలం కండువా కప్పుకున్నారు. ఈటలతో...

Etela Rajender Joins BJP: బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌... ఆయనతోపాటు మరికొందరు నేతలు
Rajender Joins Bjp The Pres
Follow us on

మాజీ మంత్రి, తెలంగాణలోని కీలకనేత ఈటల రాజేందర్‌లో బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్ సమక్షంలో ఈటల కమలం కండువా కప్పుకున్నారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌ జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, గండ్ర నళిని, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, అందె బాబయ్య తదితరులు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆయనతో పాటు ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్ సమక్షంలో పార్టీలో చేరారు.